గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేకు చుక్కెదురు

గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేకు చుక్కెదురు
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు గడప గడపకు కార్యక్రమంలో చుక్కెదురైంది

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు గడప గడపకు కార్యక్రమంలో చుక్కెదురైంది. పేట అగ్రహారంలో గడప గడప కార్యక్రమాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. గ్రామంలోని ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. నాలుగేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యే తమ గ్రామానికి ఏంచేశారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. యూట్యూబ్‌లో డ్యాన్స్ వేస్తున్నట్లు ఎంఎస్ బాబు కనిపించడం మినహా ఏనాడు తమ గ్రామాభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. మరోవైపు ఎమ్మెల్యే వచ్చి వెళ్లాక స్థానికులు తమ గ్రామానికి మైలు పడిందని వీధులన్నీ పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. జై చంద్రబాబు నినాదాలతో పేట అగ్రహారం హోరెత్తింది.

Tags

Read MoreRead Less
Next Story