MODI: ప్రపంచాన్ని ఏకం చేసేది యోగానే

MODI: ప్రపంచాన్ని ఏకం చేసేది యోగానే
X
యోగా శాంతి మార్గం చూపుతుందన్న ప్రధాని .. విశాఖలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ... యోగా జీవన విధానమన్న ప్రధాని ఉద్బోధ

ప్ర­పం­చం అనేక సం­ఘ­ర్ష­ణ­లు, అశాం­తి, అస్థి­ర­త­తో సత­మ­త­మ­వు­తు­న్న తరు­ణం­లో... యోగా శాం­తి మా­ర్గా­న్ని ని­ర్దే­శి­స్తుం­ద­ని ప్ర­ధా­ని మోదీ అన్నా­రు. యో­గా­కు సరి­హ­ద్దు­లు లే­వ­ని, ప్ర­పం­చా­న్ని ఏకం చే­సిం­ద­ని ప్ర­ధా­ని మోదీ అన్నా­రు. వి­శా­ఖ­లో జరి­గిన 11వ అం­త­ర్జా­తీయ యోగా ది­నో­త్సవ జా­తీయ కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­న్న ప్ర­ధా­ని 3 లక్షల మం­ది­తో కలి­సి యో­గ­స­నా­లు వే­శా­రు. ఈ యోగా ది­నో­త్స­వం ‘మా­న­వా­ళి కోసం యోగా 2.0’ కు నాం­ది పల­కా­ల­ని, దీని ద్వా­రా అం­త­ర్గత శాం­తి ప్ర­పంచ వి­ధా­నం­గా మా­రా­ల­ని అం­త­ర్జా­తీయ సమా­జా­ని­కి ప్ర­ధా­ని పి­లు­పు­ని­చ్చా­రు. యోగా ను ప్ర­పం­చం­లో­ని 175 దే­శా­లు అను­స­రి­స్తు­న్నా­య­ని ఈ సం­ద­ర్భం­గా ప్ర­ధా­ని మోదీ గు­ర్తు చే­శా­రు. యోగా గ్లో­బ­లై­జ్‌ కా­వ­డం సా­మా­న్య­మైన వి­ష­యం కా­ద­న్నా­రు. యోగా ప్ర­పంచ వ్యా­ప్తం­గా ప్ర­జల జీవన శై­లి­ని మా­ర్చిం­ద­ని.. అం­త­రి­క్షం­లో కూడా యోగా చే­సిన ఘనత మన­దే­న­ని అన్నా­రు. యో­గా­కు సరి­హ­ద్దు­ల్లే­వ­ని, వయ­సు­తో పని­లే­ద­ని.. అది ప్ర­కృ­తి, ప్ర­గ­తి సం­గ­మ­మ­ని కొ­ని­యా­డా­రు. యో­గాం­ధ్ర ఈవెం­ట్‌­ను ప్ర­తి­ష్టా­త్మ­కం­గా ని­ర్వ­హిం­చిన ఏపీ సర్కా­రు­కు అభి­నం­ద­న­లు. ప్ర­జల భా­గ­స్వా­మ్యా­ని­కి ఇదొక స్ఫూ­ర్తి­గా ని­లి­చిం­ద­ని.. వి­క­సి­త్‌ భా­ర­త్‌ ఆలో­చ­న­ల­కు ఇది రూ­ప­మ­ని -ప్ర­ధా­ని మోడీ వ్యా­ఖ్యా­నిం­చా­రు.

యోగా యుద్ధాలను కూడా ఆపగలదు

ఘర్షణల నుంచి సహకారానికి, ఉద్రిక్తతల నుంచి పరిష్కారానికి ప్రపంచాన్ని నడిపించడం ద్వారా యోగా శాంతిని చేకూర్చగలదని ప్రధాని మోదీ విశ్వసిస్తున్నట్లు తెలిపారు. "దురదృష్టవశాత్తు, నేడు ప్రపంచం మొత్తం ఉద్రిక్తత, అశాంతితో సతమతమవుతోంది. అనేక ప్రాంతాల్లో అస్థిరత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో యోగా మనకు శాంతి మార్గాన్ని చూపుతుంది. మానవాళి శ్వాస తీసుకోవడానికి, సమతుల్యం చేసుకోవడానికి, తిరిగి సంపూర్ణంగా మారడానికి అవసరమైన విరామ బటన్ యోగా" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యోగా కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాకుండా, ప్రపంచ భాగస్వామ్యానికి మాధ్యమంగా మారాలని, ప్రతి దేశం, సమాజం యోగాను తమ జీవన విధానంలో, ప్రభుత్వ విధానంలో భాగంగా చేసుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, యోగా కేవలం వ్యాయామం కాదని, అదొక జీవన విధానమని అన్నారు. "యోగా అంటే సరళంగా చెప్పాలంటే కలపడం. ఇది ప్రపంచాన్ని కలిపింది" అని తెలిపారు.

గత పదేళ్లలో యోగా కోట్ల మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది అన్నారు మోదీ. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత యోగాను అనుసరిస్తున్నారని తెలిపారు. యోగా చేయడానికి వయసుతో సంబంధం లేదు.. దీనికి హద్దులు లేవు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే యోగానే అత్యుత్తమ మార్గం అని మోదీ చెప్పుకొచ్చారు.

Tags

Next Story