Y.S. Viveka Murder Case: సుప్రీంకోర్టులో సునీత మరో పిటీషన్
By - Subba Reddy |20 May 2023 6:30 AM GMT
వైఎస్ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశారు
వైఎస్ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశారు. అప్రూవర్గా మారిన దస్తగిరి క్షమాభిక్షను రద్దు చేయాలని వివేకా పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ను పరిగణనలోకి తీసుకోవద్దన్న సునీత.. మిసిలేనియస్ అప్లికేషన్లో ఇంప్లీడ్ అయ్యారు. తాను, తన తల్లి మాత్రమే బాధితులమని, ఫిర్యాదు చేసినంత మాత్రాన కృష్ణారెడ్డి బాధితుడు కాదని పిటీషన్లో తెలిపారు. దర్యాప్తు పక్కదారి పట్టించేందుకే నిందితుల ప్రోద్భలంతో కృష్ణారెడ్డి పిటీషన్ వేశారని తెలిపారు. సునీత విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం సీబీఐకీ నోటీసులిచ్చింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com