Yuva Galam : లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులే

X
By - Subba Reddy |5 Feb 2023 11:30 AM IST
పూతలపట్టు నియోజకవర్గం మారెడుపల్లిలో వేదిక తొలగింపు
నారా లోకేష్ యువగళం పాదయాత్రను పోలీసులు అడగడుగునా అడ్డుకుంటున్నారు. ఆయన ఎక్కడా ప్రసంగించకుండా చేస్తున్నారు. తాజాగా పూతలపట్టు నియోజకవర్గం మారెడుపల్లిలోటీడీపీ నేతలు ఏర్పాటు చేసిన వేదికను తొలగించారు. లోకేష్కు ఘనంగా స్వాగతం పలికేందుకు వేదికతో పాటు భారీగా ఏర్పాట్లు చేశారు టీడీపీ కార్యకర్తలు. అయితే స్టేజి ఏర్పాటుకు అనుమతి లేదన్న పోలీసులు దాన్ని తొలగించాలని ఆదేశించారు. స్వంత స్థలంలో వేదిక ఏర్పాటు చేసినా కూడా తొలగించాల్సిందేనంటుూ పట్టుపట్టారు. దీంతో ఆ వేదికను తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. పోలీసుల వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com