Yuva Galam : యువగళంలో వేల గళాలు

Yuva Galam :  యువగళంలో వేల గళాలు
ఆయన వెంట వేలాది మంది కార్యకర్తలు తరలిరాగా యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుంది

తెలుగుదేశం యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర 12వ రోజుకు చేరింది. ఆయన వెంట వేలాది మంది కార్యకర్తలు తరలిరాగా యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ప్రజా సమస్యల వినడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రకు పార్టీ కార్యకర్తలతో పాటు జనం పెద్దఎత్తున తరలివస్తున్నారు.

ప్రస్తుతం చిత్తూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. ఐతే ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు కొంగారెడ్డిపల్లి టిడిపి జిల్లా కార్యాలయం పక్కనున్న క్యాంప్ సైట్‌లో ఉండనున్న లోకేష్‌...పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షించనున్నారు. సాయంత్రం 3 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్యకర్తలనుద్దేశించి పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. కొంగారెడ్డిపల్లి అన్నా క్యాంటీన్ మీదుగా..రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇక రాత్రి దిగువ మాసాపల్లి దగ్గర ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.

Tags

Next Story