Yuvagalam: జగన్ హయాంలో ప్రజలకు కుటుంబ పోషణ భారమైంది : లోకేష్

X
By - Vijayanand |25 Feb 2023 2:54 PM IST
పనులు దొరక్క కుటుంబపోషణ భారయై 60మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని వారందని టీడీపీ ఆదుకుందన్నారు
తిరుపతిలో టీడీపీ అగ్రనేత లోకేష్ చేపట్టిన యువగళం కార్యక్రమంలో జోష్ నెలకొంది. అన్ని వర్గాలతో లోకేష్ మమేకమవుతున్నారు. భవన నిర్మాణ కార్మికులతో లోకేష్ సమావేశం నిర్వహించారు. పనులు దొరక్క కుటుంబపోషణ భారయై 60మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని వారందని టీడీపీ ఆదుకుందన్నారు. ఒక్క ఇసుకలోనే సీఎం జగన్ మూడు కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆదుకుంటామని భరోసా ఇచ్చారు లోకేష్. భవన నిర్మాణ బోర్డు నుంచి 850 కోట్ల నిధులు మళ్లించారని అన్నారు. 1214 సర్క్యూలర్ తీసుకొచ్చి కార్మికుల హెల్త్ కేర్ తీసుకోకపోవడం దుర్మార్గం అన్నారు. మూడు సంవత్సరాల్లో సిమెంట్ ధరలు 60శాతం పెరిగాయని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com