Yuvagalam : లోకేష్ తో వంగవీటి రాధా భేటీ

Yuvagalam : లోకేష్ తో వంగవీటి రాధా భేటీ
రాష్ట్ర రాజకీయాలపై లోకేష్‌తో అరగంట సేపు చర్చించారు వంగవీటి రాధా

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లోకేష్‌తో వంగవీటి రాధా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కారవాన్‌లో సమావేశమైన ఇరువురు.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు రాధా. లోకేష్‌ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని అభినందించారు. రాష్ట్ర రాజకీయాలపై లోకేష్‌తో అరగంట సేపు చర్చించారు వంగవీటి రాధా. ఇవాళ ఉదయం నుంచి అన్నమయ్య జిల్లాలో జరుగుతున్న లోకేష్‌ పాదయాత్రలో పాల్గొన్నారు వంగవీటి రాధా.

ఏపీని రైతులు లేని రాజ్యంగా జగన్‌ మార్చారని విమర్శించారు లోకేష్‌. యువగళం పాదయాత్రలో భాగంగా పీలేరు పరిధిలో ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వైసీపీ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గిట్టుబాటు ధరలు లేవని.. రైతులు అప్పుల పాలయ్యారని అన్నారు. ఇప్పుడు కొత్తగా మోటార్లకు మీటర్లు అంటున్నారని భగ్గుమన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags

Read MoreRead Less
Next Story