Yuvagalam: మాటతప్పడం జగన్‌ నైజం: నారా లోకేష్‌

Yuvagalam: మాటతప్పడం జగన్‌ నైజం: నారా లోకేష్‌
టీడీపీ అధికారంలోకి రాగానే బుడగ, బేడజంగాల సమస్యలు పరిష్కరిస్తామని భరోసా

అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలు మాటతప్పడం సీఎం జగన్‌ నైజమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. 44వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా బి.కొత్తపేట ఇందిరమ్మ కాలనీలో పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో బుడగజంగ సంక్షేమ సంఘం నాయకులు ఆయను కలిశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్న లోకేష్ సీఎం జగన్‌ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి రాగానే బుడగ, బేడజంగాల సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అధ్యయన కమిటీ నివేదిక పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. బుడగ, బేడ జంగాలు ఆర్థీకంగా నిలదొక్కుకునేందుకు సబ్సీడీ రుణాలు అందిస్తామని లోకేష్‌ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story