Yuvagalam : జనం జగన్‌ని నమ్మడం లేదు : నారా లోకేష్

Yuvagalam : జనం జగన్‌ని నమ్మడం లేదు : నారా లోకేష్

జనం జగన్‌ని నమ్మడం లేదు.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా జగన్‌ని నమ్మడం లేదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. అందరూ జగన్ అంటే తనమకు నమ్మకం లేదని అంటున్నారని లోకేష్‌ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని ఒడిసి బహిరంగ సభలో వైసీపీ పాలనపై లోకేష్‌ నిప్పులు చెరిగారు. సింహం సింగిల్‌గా వస్తుందని చెప్పి.. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని టీవీలు పగులగొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనం జగన్‌కి తగిన బుద్ది చెప్పారన్నారు. వైసీపీ పాలనలో ఏపీలో డెవలప్‌మెంట్‌ నిల్‌... అప్పులు ఫుల్‌ అని విమర్శించారు. ధరలన్నీ పెంచేశారని.. ఇచ్చిన హామీలు మర్చిపోయారని మండిపడ్డారు. ఇక.. పుట్టపర్తి ఎమ్మెల్యే ప్రజాధనం దోపిడీలో దిట్ట అని లోకేష్‌ ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదిలేది లేదన్నారు.

Next Story