Yuvagalam : డోన్ నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర

కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. అశేష జనవాహిని మధ్య కొనసాగుతుంది. ఊరువాడ ఆయనకు ఘన స్వాగతం పలుకుతుంది. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. చిన్నాపెద్ద కలిసి లోకేష్ వెంట నడుస్తున్నారు. నల్లమేకలపల్లి గ్రామస్తులు లోకేష్ను కలిసి సమస్యలను విన్నవించారు. తమ గ్రామమంతా బోర్ల కింద వ్యవసాయం చేస్తుందని.. చెరువుకుంట శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. దీనికి మరమ్మతులు చేయాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని లోకేష్ వద్ద వాపోయారు. చెరువుకుంటలో నీళ్లుంటేనే బోర్లకు నీరు పుష్కలంగా అందుతుందని గ్రామస్తులు తెలిపారు. చెరువుకుంట మరమ్మతులు చేయించి ఆదుకోవాలని కోరారు.
టీడీపీ అధికారంలోకి రాగానే చెరువుకుంటకు మరమ్మతులు చేయిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. నల్లమేకలపల్లిలో వ్యవసాయం, పశువులకు నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. గతంలో రైతులకు సబ్సిడీలు, యంత్ర పరికరాలు అందించి అండగా నిలిచామని గుర్తు చేశారు. రాయలసీమలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చేందుకు ఇక్కడి ప్రాజెక్టులపై.. చంద్రబాబు ప్రభుత్వం 11వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com