Yuvagalam: 34వ రోజుకు చేరుకున్న యువగళం

Yuvagalam: 34వ రోజుకు చేరుకున్న యువగళం
చిత్తూరు జిల్లా కొక్కువారిపల్లి నుంచి నేడు పాదయాత్ర ప్రారంభం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర 34వ రోజు కొనసాగుతోంది. పెద్ద ఎత్తున తరలి వస్తున్న టీడీపీ శ్రేణులు, అభిమానుల సంఘీభావంతో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కొక్కువారిపల్లి విడిది కేంద్రం వద్ద అభిమానులు లోకేష్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచే పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటి వరకు లోకేశ్ పాదయాత్ర 437 కిలోమీటర్ల దూరం కొనసాగింది.

పాదయాత్రలో లోకేష్ అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ఉదయం 10గంటలకు దేవళంపేటలో స్థానికులతో యువనాయకుడు సమావేశం కానున్నారు. అలాగే తుడుంవారిపల్లెలో బీసీలతోనూ లోకేష్ భేటీ కానున్నారు. ఉదయం 11గంటల 30నిమిషాలకు కల్లూరులో యువతతో మాటమంతీ నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నాం 12గంటల 30 నిమిషాలకు కల్లూరులో భోజన విరామం తీసుకోనున్నారు. మధ్యాహ్నం 2గంటల 30నిమిషాలకు కల్లూరులో ముస్లింలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నాం 3గంటల 30 నిమిషాల నుంచి మళ్లీ పాదయాత్రను కొనసాగించనున్నారు. ఇక సాయంత్రం 6గంటలకు జ్యోతినగర్ విడిది కేంద్రంలో బస చేయనున్నారు లోకేష్.

Tags

Read MoreRead Less
Next Story