Yuvagalam: 58వ రోజు లోకేష్ పాదయాత్ర
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. ఇవాళ 58వ రోజు ఉదయం 8గంటలకు ధర్మవరం సీఎన్బీ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. 8.45కి గొట్లూరులో కురుబ సామాజిక వర్గీయులతో భేటీ అవుతారు. 9.50కి నాగలూరులో బోయ సామాజిక వర్గీయులతో సమావేశమవుతారు. 10గంటల 30 ని మిషాలకు వేల్పుమడుగులో పొదరాళ్లపల్లి వాసులతో భేటీ అవుతారు. విరామ అనంతరం మధ్యాహ్నం 3గంటల 30నిమి షాలకు బత్తలపల్లి సర్కిల్ నుంచి తిరిగి పాదయాత్ర కొనసాగిస్తారు. సాయంత్రం 4గంటలకు బత్తలపల్లి బహిరంగసభలో ప్రసంగిస్తారు. 5.15కి బత్తలపల్లిలో స్థానికులతో మాటమంతీ నిర్వహిస్తారు. సాయంత్రం 6.50కి లింగారెడ్డిపల్లిలో స్థానికు లతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. రాత్రి 7గంటల 30నిమిషాలకు ముస్తూరు విడిది కేంద్రం వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com