Yuvagalam : అన్నమయ్య జిల్లాలో యువగళం జోష్

Yuvagalam : అన్నమయ్య జిల్లాలో యువగళం జోష్
లోకేష్ ప్రభజంనంతో అన్నమయ్య జిల్లా పసుపుమయంగా మారిపోయింది. పెద్ద ఎత్తున తరలి వస్తున్న టీడీపీ శ్రేణులు, అభిమానుల సంఘీభావంతో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది

అన్నమయ్య జిల్లాలో యువగళం జోష్ కొనసాగుతోంది. పులిచర్ల మండలం జ్యోతినగర్‌ విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. లోకేష్ ప్రభజంనంతో అన్నమయ్య జిల్లా పసుపుమయంగా మారిపోయింది. పెద్ద ఎత్తున తరలి వస్తున్న టీడీపీ శ్రేణులు, అభిమానుల సంఘీభావంతో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇవాళ యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటి వరకు లోకేశ్ పాదయాత్ర 448 కిలోమీటర్ల దూరం కొనసాగింది. పాదయాత్రలో లోకేష్ అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ఎంజేఆర్ కాలేజీ ఆగ్రహారం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ నిర్వహిస్తారు.

పీలేరు భాస్కర్ ఐటిఐ కళాశాల వద్ద పీలేరు నియోజకవర్గంలోకి లోకేష్ ప్రవేశించనున్నారు. యువనేతకు ఆహ్వానం పలికేందుకు నియోజకవర్గ టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం భాస్కర ఐటిఐ వద్ద నుంచి తిరిగి పాదయాత్రను కొనసాగుతుంది. 4గంటలకు పీలేరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో యువనేత ప్రసంగింస్తారు. సాయత్రంపీలేరు జంక్షన్ వద్ద, అనంతరం పీలేరు ఆర్టీసి బస్టాండు వద్ద స్థానికులతో భేటీ అవుతారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి అంబేద్కర్ విగ్రహం వద్ద ముస్లింలతో మాటామంతీ నిర్వహిస్తారు. రాత్రి 8గంటలకు పీలేరు శివారులో ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో లోకేష్ బస చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story