Yuvagalam: యువనేతతో కదంతొక్కుతున్న కర్నూలు

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇవాళ కర్నూలు నియోజకవర్గం లో పాదయాత్ర సాగనుంది. లోకేష్కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివస్తున్నారు.. జై టీడీపీ, జై లోకేష్ నినాదాలతో కర్నూలు దద్దరిల్లింది. లోకేష్తో సెల్ఫీలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపడ్డారు..అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు. యువనేతను చూసేందుకు భారీగా తరలివచ్చారు.ఇక లోకేష్ పాదయాత్రలో ఊహించని రీతిలో జన ప్రవాహం కనిపించింది.. దారిపొడవునా జనం బారులు తీరారు.. లోకేష్ను చూసేందుకు,ఆయనతో తమ సమస్యలు చెప్పుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
ఇవాళ 93వ రోజు పాదయాత్ర కర్నూలు నియోజకవర్గంలో జరగనుంది.లోకేష్ పాదయాత్రకు కు సంఘీబావం తెలిపారు న్యాయవాదులు.హైకోర్టు ఏర్పాటు చేస్తామని నాలుగేళ్లగా జగన్ మోసం చేశారనిజగన్ మాయ మాటలు విని మోసపోయామని న్యాయవాదులు లోకేష్ కు విన్పవించుకున్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చాక కర్నూలులో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న లోకేష్ మాది జగన్లా మాట మార్చి మడమ తిప్పే బ్యాచ్ కాదంటూ కౌంటర్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com