Yuvagalam:ఆలూరులో లోకేష్ పాదయాత్ర

లోకేష్ యువగళం పాదయాత్ర ఇవాళ 74వ రోజుకు చేరింది. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు పల్లెదొడ్డి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. పల్లె దొడ్డి స్థానికులతో సమావేశమవుతారు లోకేష్. ఉదయం .8.25కి గద్దెరాలలో స్థానికులతో సమావేశమవుతారు. ఉదయం పది గంటలకు దేవరకొండలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద బీసీలతో భేటీ అవుతారు. అనంతరం.. అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులతో సమావేశమవుతారు. ఉదయం 11.30కి దేవరకొండ క్రాస్ వద్ద TNSF విద్యార్థులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12.25కి కుంకనూరు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ నిర్వహిస్తారు. స్థానికుల సమస్యలను తెలుసుకుంారు. భోజన విరామం అనంతరం.. మధ్యాహ్నం 3.35కి కుంకనూరు క్రాస్ నుంచి తిరిగి పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 5.05కి అల్లారుదిన్నె వద్ద కురుబ సామాజిక వర్గీయులతో భేటీ అవుతారు. అనంతరం వలగొండ క్రాస్ వద్ద లోకేష్ బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం.. సాయంత్రం 6.30కి వలగొండ క్రాస్ వద్ద విడిదికేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com