Yuvagalam: అరాచక పాలన సాగిస్తున్న జగన్‌: లోకేష్

Yuvagalam: అరాచక పాలన సాగిస్తున్న జగన్‌: లోకేష్
తాజాగా 18 వందల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నా యువగళం అదే జోరుతో హోరెత్తుతోంది.

ఏపీలో అరాచక పాలన సాగిస్తున్న జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. కుప్పంలో వేసిన తొలి అడుగు మొదలు.. తాజాగా 18 వందల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నా యువగళం అదే జోరుతో హోరెత్తుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. ఇవాళ 139వ రోజు గూడూరు నియోజకవర్గంలో మధ్యాహ్నం 2 గంటలకు తాడిమేడు క్రాస్ క్యాంప్ సైట్‌లో మత్స్యకారులతో ముఖాముఖీ నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతరం కొత్తగుంటలో రైతులు, చిట్టమూరు, వాకాడ ఎస్టీ కాలనీలో స్థానికులతో సమావేశం అవుతారు. సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు వాకాడు బీసీ కాలనీలో బీసీ సామాజిక వర్గీయులతో లోకేష్ భేటీ అవుతారు. ఆ తర్వాత వాకాడు టెంపుల్ జంక్షన్, వాకాడు అశోకా పిల్లర్, రంగన్నపేట, తినెళ్లపూడిలో స్థానికులతో సమావేశం కానున్నారు. రాత్రి 8 గంటల 20 నిమిషాలకు కోట క్రాస్ విడిది కేంద్రంలో బస చేయనున్నారు నారా లోకేష్.

Tags

Read MoreRead Less
Next Story