ఎక్కువ మాట్లాడితే నా గతే పడుతుంది; అందుకే ఎవ్వరూ మాట్లాడరు : స్వరాభాస్కర్

ముంబై
ఎక్కువ మాట్లాడితే నా గతే పడుతుంది; అందుకే ఎవ్వరూ మాట్లాడరు : స్వరాభాస్కర్
బాలీవుడ్ లో మరోసారి కలకలం సృష్టిస్తున్న స్వరాభాస్కర్ మాటల తూటాలు; ఇక్కడ నోరు విప్పితే తన గతే పడుతుందంటూ ఘాటు వ్యాఖ్యలు.

ముంబై : ముక్కుసూటిగా మాట్లాడుతూ బాలీవుడ్ నాట ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన స్వరాభాస్కర్, ఈ మధ్య సినిమాలకన్నా ఎక్కువగా కాంట్రావర్సీలతోనే కాలాక్షేపం చేస్తోంది. ఇటీవలే భారత్ జోడో యాత్రలో భాగస్వామి అయి మీడియా దృష్టిని ఆకట్టుకున్న స్వరా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి బాలీవుడ్ జనాలకు చురకలు అంటించింది. తాను కొన్ని విషయాలపై మాట్లాడటం వల్లే తనను కొంత మంది వెలి వేశారని ఆరోపించింది. గత ఎనిమిదేళ్లుగా పలుకుబడి ఉన్నవాళ్లు తనను టార్గెట్ చేస్తున్నారని వాపోయింది. ప్రశ్నించే వారిని తొక్కేయడం మన దేశంలో చాలా సాధారణమని వ్యాఖ్యానించింది. అందుకే బాలీవుడ్ లో చాలామంది మాట్లాడకుండా మ ౌనంగా ఉండిపోతున్నారని తెలిపింది. వాళ్లు నోరు తెరిస్తే తనకు పట్టిన గతే పడుతుందన్న భయంతో చాలామంది నోరు నొక్కేసుకుంటున్నారట. ఇక తాను మాట్లాడటం వల్ల సినిమా ఆఫర్లు కోల్పోయానంటోంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వల్ల తనకు ఎంతో ఇష్టమైన పనిని కోల్పోతున్నాని బాధపడుతోంది. అయితే ఇది తనను ఆపలేదని వ్యాఖ్యానించిన స్వరా భాస్కర్ భారత్ జోడో యాత్రలో పాలుపంచుకునేందుకు తనకు ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story