Bollywood: సోనూసూద్‌ 'ఫతే' పనులు షురూ

Bollywood: సోనూసూద్‌ ఫతే పనులు షురూ
సోనూసూద్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జంటగా వైభవ్ మిశ్రా దర్శకత్వంలో ZEE స్టూడియోస్ సమర్పణలో శాంతి సాగర్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్

సోనూసూద్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జంటగా వైభవ్ మిశ్రా దర్శకత్వంలో ZEE స్టూడియోస్ సమర్పణలో శాంతి సాగర్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఫతే'. ఈ సినిమా పనులు అమృత్‌సర్‌లో ఘణంగా ప్రారంభం అయ్యాయి. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో సోనూ, జాక్వెలిన్‌ ఎథికల్ హ్యాకర్లచే శిక్షణ పొందడానికి వివిధ వర్క్‌షాప్‌లలో పాల్గొన్నారు.

సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా వాస్తవికతకు దగ్గర ఉండేలా రూపుదిద్దుకోనుందని, కరోనా సమయంలో ప్రజలకు జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీయడం జరుగుతతుందని హీరో సోనూ సూద్ తెలిపారు.

డైరెక్టర్‌ వైభవ్ మిశ్రా చెప్పిన స్టోరీ నచ్చడంతో తనిచ్చిన స్క్రిప్టు చదివాను, అది చదివినప్పటి నుంచి ఇలాంటి మంచి సినిమాలో నటించాలని ఆసక్తి పెరిగిందన్నారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని తెలిపారు.

Read MoreRead Less
Next Story