ఒకే చోట బాలీవుడ్ లెజెండ్స్.. ఫ్యాన్స్‌ ఖుషీ

ఒకే చోట బాలీవుడ్ లెజెండ్స్.. ఫ్యాన్స్‌ ఖుషీ



వారంతా బాలీవుడ్ సినిమాల్లో వివిధ రకాల పాత్రలు, విలక్షణమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. వారంతా తమ తమ సినిమాల్లో ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ ఒకేచోట కలుసుకోవడం తక్కువగా చూస్తుంటాం. కానీ

ప్రముఖ నటుడు సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ రిసెప్షన్ పాతతరం, ఈ తరం సినీ నటీనటుల కలయికకు వేదికైంది. బాలీవుడ్‌ నుంచి ప్రముఖ నటీ నటులందరూ హాజరయ్యారు. ఈ స్టార్ స్టడ్డెడ్ ఈవెంట్ ముంబయ్‌లోని తాజ్‌ ల్యాండ్స్‌లో జరగ్గా కరణ్ మరియు ద్రిశ జోడీ ఒక్కటైంది.

ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో అలనాటి నటుడు ధర్మేంద్ర, సన్నీ డియోల్, ప్రస్తుత స్టార్స్ సల్మాన్ ఖాన్, అమీర్‌ ఖాన్‌లతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.


అనుపమ్ ఖేర్ దీనిని పోస్ట్ చేస్తూ తన పాత స్మృతులను గుర్తుచేసుకున్నాడు... "ఇది 90's తరం సొగసు ఇది. మైబైల్ ఫోన్లు, వానిటీ వ్యాన్స్ లేని తరం నుంచి వచ్చిన నటులం. అప్పట్లో ఎన్నో మధుర స్మృతులు, నవ్వులు పంచుకున్నారం. ఇప్పటికీ మమ్మల్ని మేము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాం. మిమ్మల్ని కలవడం ఆనందకరం`" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

దీంతో వీరిని చూసిన ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. ఇన్‌స్టాగ్రాంలో ఆ చిత్రానికి వేలాది లైకులు, కామెంట్లు చేస్తున్నారు.

"వీరంతా భారతీయ సినిమా లెజెండ్స్" అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.

"సన్నీడియోల్ కొడుకు, కోడలిని ఆశీర్వదించడానికి వచ్చిన ముగ్గురు లెజెండరీ నటులు అనుపమ్ ఖేర్, సన్నీ డియోల్, అమీర్ ఖాన్‌లను ఒకే ఫ్రేంలో చూడటం అత్యంత ఆనందకరంగా ఉంది" అని మరో యూజర్ కామెంట్ చేశాడు.

కరణ్ డియోల్ పెళ్లిరోజు సందర్భంగా సోషల్ మీడియాలో రాస్తూ.."మన అందమైన జీవిత ప్రయాణం ప్రారంభం కాబోతుంది. నా ప్రస్తుతం మరియు భవిష్యత్తు నువ్వే. మీ ఆశీర్వచనాలు, శుభాకాంక్షలతో మేము ఉప్పొంగిపోతున్నాము" అని పోస్ట్ చేశాడు.

ఈ రోజు నేను మంచి కూతురుని పొందాను. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. #HappiestFather.. అంటూ నటుడు సన్నీ డియోల్ ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చాడు.



Tags

Read MoreRead Less
Next Story