Case Against Gauri Khan: అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుంది యవ్వారం...

Case Against Gauri Khan: అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుంది యవ్వారం...
షారుక్ ఖాన్ భార్యామణి గౌరీ ఖాన్ పై కేసు నమోదు; ఆస్తి కొనుగోలు విషయంలో గౌరీ పై ఉత్తర్ ప్రదేశ్ లో కేసు నమోదు...

బాలీవుడ్ బాద్షా భార్యామణిగా పాప్యులారిటీ సంపాదించుకున్న గౌరీఖాన్, తనకున్న ఇమేజ్ తో పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే ఇప్పుడు ఆమెకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. గౌరీపై ఏకంగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు అయింది. ముంబైకు చెందిన జశ్వంత్ షా ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో గౌరీ ఖాన్ పై కేసు నమోదు చేశాడు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 409 కింద ఈ ఆమెపై కేసు ఫైల్ చేశాడు. గౌరీ ఖాన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు రూ.86 లక్షలు వెచ్చించినప్పటికీ వారు ఇంకా తనకు ఇంటిని అందజేయలేదని జశ్వంత్ ఆరోపిస్తున్నాడు. లక్నోలోని సుశాంత్ గోల్ప్ సిటీ ప్రాంతంలో తుల్సీయానీ గోల్ఫ్ వ్యూలో ఉన్న ఫ్లాట్ ను మరొకరికి ఇచ్చేసినట్లు వెల్లడించాడు. గౌరీతో పాటూ తుల్సియానీ బిల్డర్స్ పైనా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నాడు. గౌరీఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం వల్లే తాను ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేశానని కాబట్టి ఆమె బాధ్యత వహించాల్సిందేనని జశ్వంత్ పేర్కొన్నారు. మరి దీనిపై గౌరీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story