Janhvi Kapoor: ఇల్లు అమ్మేసిన జాన్వీ.. భారీ మొత్తంతో దక్కించుకున్న స్టార్ హీరో..

Janhvi Kapoor: ఇల్లు అమ్మేసిన జాన్వీ.. భారీ మొత్తంతో దక్కించుకున్న స్టార్ హీరో..
Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్.

Janhvi Kapoor: సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీలందరూ ముంబాయిలోని జుహూలోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులకు ఆ ఏరియాలో చాలా పోష్ ఇళ్లులు కూడా ఉన్నాయి. కానీ ఇటీవల అర్జున్ కపూర్ తన ఇంటిని అమ్మేసి వేరే దగ్గరికి వెళ్లిపోగా.. తన సోదరి జాన్వీ కపూర్ కూడా ఓ స్టార్ హీరోకు తన ఇళ్లును అమ్మేసినట్టు సమాచారం. అంతే కాకుండా ఈ ఇంటిని అమ్మేసిన రేటు చూస్తుంటే ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.


అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. మొదటి సినిమా సమయంలో తన తండ్రి తనకు అండగా నిలబడినా కూడా.. ఆ తర్వాత స్టోరీ సెలక్షన్ విషయంలో తన సొంత నిర్ణయాలు ఫాలో అవుతూ వస్తోంది. ప్రస్తుతం పలువురు బాలీవుడ్ కుర్ర హీరోలతో కలిసి సినిమాలు చేస్తోంది జాన్వీ. ఇంతలోనే జుహూలోని తన ట్రిపులెక్స్ అపార్ట్‌మెంట్‌ను అమ్మేసిందని వార్తలు వస్తున్నాయి.


ఇటీవల బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో రాజ్‌కుమార్ రావు.. తన సహనటి పత్రలేఖను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత వీరు ఎక్కడ ఉండాలా అని ఆలోచిస్తుండగా జాన్వీ తన అపార్ట్‌మెంట్‌ను విక్రయిస్తున్న విషయం తెలుసుకున్నారట. ఆ ఫ్లాట్ వారికి బాగా నచ్చడంతో రూ.44 కోట్లతో ఆ ఇల్లును కొనుగోలు చేశారట రాజ్‌కుమార్ రావు దంపతులు.


జుహూలోని ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌‌లో 14, 15, 16వ ఫ్లోర్లు కలిపి ఈ ఫ్లాట్ ఉంటుందట. అంతే కాకుండా కేవలం ఈ ఫ్లాట్ల పార్కింగ్ స్పేస్ కోసమే రాజ్‌కుమార్ రావు మరో రూ.2.19 కోట్లను ఖర్చు చేసినట్టు సమాచారం. మొత్తానికి జాన్వీ వదులుకున్న ఈ అపార్ట్‌మెంట్‌ను కొత్త దంపతులు దక్కించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story