Shilpa Shetty: 'అందుకోసమే సోషల్ మీడియాకు దూరం'.. ఫ్యాన్స్కు నటి షాక్
Shilpa Shetty: చాలామంది సెలబ్రిటీలు తమ అభిమానులకు దగ్గరగా ఉండేలా చేసేది సోషల్ మీడియా. వారి ప్రొఫెషనల్ విషయాలు, పర్సనల్ విషయాలు అన్నీ ఫ్యాన్స్తో పంచుకోవడానికి సోషల్ మీడియానే మాధ్యమంగా ఉపయోగిస్తుంటారు సెలబ్రిటీలు. కానీ ఈమధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలకు సోషల్ మీడియాపై ఇంట్రెస్ట్ పోతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ఫ్యాన్స్కు షాకిచ్చింది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ శిల్పా శెట్టి ప్రస్తుతం బుల్లితెర ప్రోగ్రామ్లతో బిజీగా గడిపేస్తోంది. అంతే కాకుండా త్వరలోనే మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ కూడా ఇవ్వనుంది. చాలాకాలం తర్వాత 'హంగామా 2'లో నటించినా కూడా ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఎలాంటి సందర్భంలో అయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శిల్పా శెట్టి.. కొన్నాళ్లు వీటన్నింటికి దూరంగా ఉంటానని ఫ్యాన్స్కు షాక్ ఇచ్చింది.
'అంతా ఒకేలా ఉంది. అంతా ఒకేలా కనిపిస్తుంది. కొత్తదనం దొరికే వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను' అని క్యాప్షన్ పెట్టి ఓ బ్లాంక్ ఫోటోను షేర్ చేసింది శిల్పా శెట్టి. తన ప్రతీ సోషల్ మీడియా హ్యాండిల్లో కూడా ఇలాగే పోస్ట్ చేసింది. దీంతో తన ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు. ఇక శిల్పాను సినిమాల్లో, వెబ్ సిరీస్లలో మాత్రమే చూడాలేమో అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com