Shreya Ghoshal : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్ శ్రేయా ఘోషల్..!

X
By - TV5 Digital Team |22 May 2021 9:16 PM IST
Shreya Ghoshal ; ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Shreya Ghoshal ; ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'ఈ మధ్యాహ్నం మాకు మగ బిడ్డ పుట్టాడు. ఇంతటి అనుభూతిని గతంలో ఎప్పుడు నేను పొందలేదు. ప్రస్తుతం నేను, నా భర్త శిలాదిత్య, నా కుటుంబం సంతోషంలో మునిగితేలుతున్నాం' అంటూ ట్వీట్ చేసింది. దీనితో ఆమెకి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా శ్రేయా ఘోషల్.. తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను 2015, ఫిబ్రవరి 5న వివాహం చేసుకున్నారు. శ్రేయా ఘోషాల్ హిందీలోనే కాకుండా... తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళం, అస్సామీతో పాటుగా పలుభాషల్లో పాటలు పాడి చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com