Taapsee Pannu: మీడియాపై తాప్సీ ఫైర్.. చివరికి దండం పెట్టి మరీ..

Taapsee Pannu: మీడియాపై తాప్సీ ఫైర్.. చివరికి దండం పెట్టి మరీ..
Taapsee Pannu: ప్రస్తుతం తాప్సీ.. బాలీవుడ్‌లోని బిజీ హీరోయిన్స్‌లో ఒకరు.

Taapsee Pannu: మామూలుగా సినీ సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా అక్కడ ఫోటోగ్రాఫర్లు తప్పకుండా ఉంటారు. వారి కెమెరాలకు పనిచెప్తూనే ఉంటారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్స్‌లో, హోటల్స్‌లో, సెలబ్రిటీలు ఎక్కువగా వచ్చే ప్రతీ చోట ఈ ఫోటోగ్రాఫర్ల హడావిడి ఉంటుంది. అయితే అలాంటి ఓ ఫోటోగ్రాఫర్ తాప్సీతో మర్యాద లేకుండా మాట్లాడాడు. దాంతో అమ్మడు ఒక్కసారిగా ఫైర్ అయ్యింది.

ప్రస్తుతం తాప్సీ.. బాలీవుడ్‌లోని బిజీ హీరోయిన్స్‌లో ఒకరు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. థియేటర్లలో లేదా ఓటీటీలో విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది ఈ హీరోయిన్. ఇక ప్రస్తుతం తాప్సీ.. 'దొబారా' అనే ఓ టైమ్ ట్రావెల్ చిత్రంలో నటిస్తోంది. ఆగస్ట్ 19న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో తాప్సీ బిజీగా ఉంది. అందులో భాగంగా ముంబాయిలో ఓ ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యింది. అక్కడే మీడియాతో తాప్సీకి వాగ్వాదం జరిగింది.

'దొబారా' సినిమాను ప్రమోట్ చేయడం కోసం మూవీ టీమ్ ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఆ ఈవెంట్‌కు తాప్సీ అప్పటికే లేట్ వచ్చింది. అందుకే ఫోటోగ్రాఫర్లు పిలుస్తున్నా పట్టించుకోకుండా లోపలికి వెళ్లబోయింది. దీంతో ఓ ఫోటోగ్రాఫర్ 'మీకోసమే ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నాం' అంటూ గట్టిగా అన్నాడు. దానికి తాప్సీకి కోపం వచ్చింది. కాసేపు ఆ ఫోటోగ్రాఫర్స్‌తో వాగ్వాదానికి దిగింది. మర్యాదగా మాట్లాడండి అంటూ చెప్పుకొచ్చింది. చివరికి ఫోటోగ్రాఫర్స్ అందరూ తాప్సీకి విరుద్ధంగా మాట్లాడుతుండడంతో దండం పెట్టి 'మీరే కరెక్ట్.. యాక్టర్సే తప్పు' అంటూ వెళ్లిపోయింది.


Tags

Read MoreRead Less
Next Story