టీవీ నటి జరీనా రోషన్ కన్నుమూత

By - kasi |19 Oct 2020 6:07 AM GMT
ప్రముఖ టీవీ నటి జరీనా రోషన్ ఖాన్ మరణించారు. ఆమె వయసు 54 సంవత్సరాలు.. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఆదివారం హఠాత్తుగా ఆమెకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు. జరీనా నటించిన 'కుంకుమ్ భాగ్య' సహనటీనటులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా నివాళలు అర్పించారు. కుంకుమ్ భాగ్యలో జరీనా నటించిన ఇందూ దాది పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com