తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో ప్రభాస్
By - Vijayanand |6 Jun 2023 6:14 AM GMT
తిరుమల శ్రీవారిని హీరో ప్రభాస్ దర్శించుకున్నారు. వేకువ జామున సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వచ్చిన ప్రభాస్కు అధికారులు స్వాగతం పలికారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ప్రభాస్.. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు ప్రభాస్ను ఆశీర్వాదించారు. ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం బయటకు వచ్చిన ప్రభాస్ను చూసి అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com