పల్నాడు జిల్లాలో భారీ భూ కుంభకోణం
By - Vijayanand |8 Jun 2023 10:52 AM GMT
పల్నాడు జిల్లాలో భారీ భూ కుంభకోణం సంచలనం సృష్టిస్తోంది. టీవీ5 ఇన్వెస్టిగేషన్లో అధికారి పార్టీ నేతల భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు.. రెవెన్యూ అధికారుల కుమ్మక్కై ప్రభుత్వ భూములకు టెండర్ పెట్టారు. మాచర్ల, గురజాల ప్రాంతాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాహా చేశారు. ఏకంగా రెవెన్యూ రికార్డుల్లో.. మీ భూమి యాప్లో.. ఒక్కొక్కరి పేరుపై 500 నుంచి వెయ్యి ఎకరాల దాకా చేర్చుకున్న వైనం నివ్వెరపర్చుతోంది. మాచర్ల, గురజాల ప్రాంతాల్లో ఎక్కువగా అటవీ భూములు ఉండడంతో.. అధికార పార్టీ నేతలు వాటిపై కన్నేసి.. ఏకంగా మీభూమి యాప్లో ఎక్కించుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com