Adani Row: షేర్స్ కుప్పకూలడంపై మల్లురవి ఫైర్
By - Chitralekha |28 Jan 2023 11:27 AM GMT
అదానీ షేర్స్పై ఆర్బీఐ, సెబీ విచారణ జరపాలని డిమాండ్ ; అనేక ప్రభుత్వ సంస్థలను అదానీకి మోదీ కట్టబెట్టారు; ఎల్ఐసీ, ఎస్బీఐతో పాటు అనేక సంస్థలు నష్టపోతున్నారు.....
అదానీ కంపెనీ షేర్స్ కుప్పకూలడంపై టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లురవి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అదానీ షేర్స్పై ఆర్బీఐ, సెబీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అనేక ప్రభుత్వ సంస్థలను అదానీకి ప్రధాని మోదీ కట్టబెట్టారని ఆరోపించారు. కేంద్రం చర్యలతో ఎల్ఐసీ, ఎస్బీఐతో పాటు అనేక సంస్థలు నష్టపోతున్నాయని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉందని.. సంక్షోభంపై మోదీ మౌనం వీడాలని మల్లురవి స్పష్టం చేశారు
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com