Airtel 5G: 5జీ సేవలకు సంబంధించి ఎయిర్టెల్ కీలక ప్రకటన..
Airtel 5G: 5 జీ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఎయిర్టెల్.

Airtel 5G: 5 జీ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఎయిర్టెల్. ఆగష్టు నెలలోనే 5 జీ సేవలను తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు టెలికాం గేర్ల తయారీ సంస్థలైన ఎరిక్సన్, నోకియా, శాంసంగ్తో ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు ఎరిక్సన్,నోకియాతో చాలా రోజుల నుంచి ఒప్పందం కొనసాగిస్తోంది.
ఈ ఏడాది నుంచి శాంసంగ్తోనూ ఒప్పందం కొనసాగనుంది. ఇటీవల నిర్వహించిన 5 G స్పెక్ట్రమ్ వేలంలో 900 మెగా హెడ్జ్, 1800 మెగా హెడ్జ్, 21 00, 3300 మెగా హెడ్జ్లతో పాటు 26 గిగా హెడ్జ్ బ్యాండ్స్లో 19, 867.8 మెగా హెడ్జ్ స్పెక్ట్రమ్ను 43 వేల 84 కోట్లకు ఎయిర్ టెల్ కొనుగోలు చేసింది.
మరోవైపు టెలికాం సంస్థలకు 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపు ఈ నెల 10 కల్లా పూర్తవుతుందని, వచ్చే అక్టోబర్ నుంచి 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు కేంద్ర టెలికాం శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో 5జీ సేవలు తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉంటాయన్నారు కేంద్రమంత్రి.
RELATED STORIES
Mamata Banerjee: పార్టీకి కొత్త చిక్కులు.. టీఎంసీ అధినేత్రి మమతలో...
13 Aug 2022 3:00 PM GMTHaryana: అమ్మకు ఎఫైర్.. కడతేర్చిన కొడుకు..
13 Aug 2022 11:36 AM GMTLadakh Bike Rally : లద్దాక్లో తిరంగా బైక్ ర్యాలీ..
13 Aug 2022 9:00 AM GMTSonia Gandhi : సోనియాకు మళ్లీ కరోనా.. మూడు నెలల్లో రెండవ సారి..
13 Aug 2022 8:30 AM GMTPM Modi : నెల రోజుల్లో భారత్ రెండు గొప్ప విజయాలను సాధించింది : ప్రధాని...
13 Aug 2022 7:51 AM GMTChenab Railway Bridge : జమ్ము కశ్మీర్లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే...
13 Aug 2022 7:01 AM GMT