Amul Price Hike: పాల రేట్ల పెంపు...

X
By - Chitralekha |3 Feb 2023 11:48 AM IST
లీటర్ పాలపై రూ.3 అదనం; నేటి నుంచే అమలు
దేశవ్యాప్తంగా అమూల్ పాలపై రూ.3 అదనంగా వసూలు చేయబోతున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. కొత్త ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయని గుజరాత్ డైరీ కో ఆపరేటివ్ సంస్థ వెల్లడించింది. మారిన ధరల ప్రకారం ఇకపై లీటర్ అమూల్ గోల్డ్ పాలు రూ.66 పలకనుంది. అదే విధంగా అముల్ తాజా లీటరుకు రూ.54 కాగా, అమూల్ ఆవు పాలు లీటర్ రూ.56, అమూల్ A2 గేదెపాలు లీటరుకు రూ.70 అయినట్లు సంస్థ తెలిపింది. గతేడాది అక్టోబర్ లోనే గోల్డ్, తాజా, శక్తి బ్రాండ్లపై రూ.2 అదనంగా పెంచిన ఈ సంస్థ తాజా పెంపదలకు కారణాలను కూడా వివరించింది. పాల ఉత్పత్తి ఖర్చులు అధికమవ్వడంతో పాటూ, పశువుల మేత ధరలు కూడా గణనీయంగా పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com