Jio : జియోకు కస్టమర్లు భారీ షాక్.. !

Jio : జియోకు కస్టమర్లు భారీ షాక్.. !
Jio : రిలయన్స్​జియోకు కస్టమర్స్‌లు షాక్​ ఇచ్చారు. సుమారు కోటి 29లక్షల మంది జియోను వీడారు.

Jio : రిలయన్స్​జియోకు కస్టమర్స్‌లు షాక్​ ఇచ్చారు. సుమారు కోటి 29లక్షల మంది జియోను వీడారు. అటు.. అనూహ్యంగా బీఎస్‌ఎన్‌ఎల్‌​ తన కస్టమర్సను భారీ స్థాయిలో పెంచుకుంది. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా ట్రాయ్​ డిసెంబర్​ నెల గణాంకాలను రిలీజ్‌ చేసింది.

డిసెంబర్​ నెలతో పోల్చితే భారత్​లో మొబైల్​ చందాదారుల సంఖ్య భారీగా తగ్గింది. సుమారు కోటి 28 లక్షల మంది వినియోగదారులను టెలికాం సంస్థలు కోల్పోయినట్లు ట్రాయ్‌ వెల్లడించింది. ఎక్కువ మంది చందాదారులు రిలయన్స్​ జియో, వొడాఫోన్​ ఐడియాను వీడినట్లు పేర్కొంది.


మరోవైపు భారతీ ఎయిర్​టెల్​ తన వినియోదారుల సంఖ్యను పెంచుకున్నట్లు తెలిపింది. ట్రాయ్ గణాకాల ప్రకారం రిలయన్స్​ జియో సుమారు 1.29 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయింది. ప్రస్తుతం మొత్తం జియో చందాదారుల సంఖ్య 41.57 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది ట్రాయ్‌.

మరోవైపు వొడాఫోన్​ ఐడియాను 16.14 లక్షల మంది వీడారు. ఇక... బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం క్రమంగా తన కస్టమర్ల సంఖ్యను 11 లక్షల వరకు పెంచుకున్నట్లు ట్రాయ్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story