BUSINESS: నేటి నుంచే అమల్లోకి కీలక మార్పులు

BUSINESS: నేటి నుంచే అమల్లోకి కీలక మార్పులు
X
కొత్త ఏడాదిన అమల్లోకి మార్పులు... సామాన్యుడి జీవితంపైనా ప్రభావం... రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పు

2025లో సా­మా­న్యు­ల­పై ప్ర­భా­వం చూపే ఆర్థిక వి­ష­యా­ల్లో చాలా మా­ర్పు­లొ­చ్చా­యి. 2026లో కూడా కొ­న్ని మా­ర్పు­లు రా­ను­న్నా­యి. సా­మా­న్యుల ని­త్య­జీ­వి­తం­పై ప్ర­భా­వం చూపే మా­ర్పు­లు రా­బో­తు­న్నా­యి. నేటి నుం­చి క్రె­డి­ట్ రి­పో­ర్ట్ మరింత వే­గం­గా అప్డే­ట్ కా­నుం­ది. ఇప్ప­టి­వ­ర­కూ 15 రో­జు­ల­కు ఒక­సా­రి క్రె­డి­ట్ స్కో­ర్ అప్డే­ట్ అవు­తుం­డ­గా.. ఇకపై బ్యాం­కు­లు వా­రా­ని­కి ఒక­సా­రి బ్యూ­రో­ల­కు ని­వే­దిం­చా­ల్సి ఉంది. జన­వ­రి 1 నుం­చి ఈ మా­ర్పు అమ­ల్లో­కి రా­నుం­ది. ఫలి­తం­గా బ్యాం­కు లో­న్ల­కు ఎలి­జి­బు­లి­టీ, క్రె­డి­ట్ హి­స్ట­రీ ఎప్ప­టి­క­ప్పు­డే క్రె­డిట స్కో­రు­లో అప్డే­ట్ కా­ను­న్నా­యి.

క్రెడిట్ స్కోరు

క్రె­డి­ట్ స్కో­ర్‌­కు సం­బం­ధిం­చి ఇకపై బ్యాం­కు­లు వా­రా­ని­కో­సా­రి బ్యూ­రో­ల­కు ని­వే­దిం­చా­లి. జన­వ­రి 1 నుం­చి ఈ మా­ర్పు అమ­ల్లో­కి రా­నుం­ది. 8వ వేతన కమి­ష­న్‌ జన­వ­రి 1 నుం­చి ప్రా­రం­భం కా­నుం­ది. ఆధా­ర్‌ ఎన్‌­రో­ల్మెం­ట్‌ ఐడీ ద్వా­రా పా­న్‌ కా­ర్డు తీ­సు­కు­న్న­వా­రు డి­సెం­బ­రు 31లోగా పా­న్‌-ఆధా­ర్‌ అను­సం­ధా­నం చే­సు­కో­వా­ల్సి ఉం­టుం­ది. లే­దం­టే జన­వ­రి 1 నుం­చి పా­న్‌ కా­ర్డు రద్ద­యి, కా­ర్డు ని­లి­చి­పో­తుం­ది. రై­ళ్ల­కు సం­బం­ధిం­చి కొ­త్త టైం టే­బు­ల్‌ జన­వ­రి 1 నుం­చి అమ­ల్లో­కి రా­నుం­ది. న్యూ ఇయ­ర్లో రై­ళ్ల రా­క­పో­కల సమ­యా­లు కూడా మా­ర­ను­న్నా­యి. కొ­త్త టైమ్ టే­బు­ల్ జన­వ­రి 1 నుం­చి అమ­ల్లో­కి వస్తుం­ద­ని దక్షిణ మధ్య రై­ల్వే తె­లి­పిం­ది. వం­దే­భా­ర­త్ ఎక్స ప్రె­స్ లతో పాటు మొ­త్తం 25 రై­ళ్ల సమ­యా­లు మా­ర­ను­న్నా­యి. సి­కిం­ద్రా­బా­ద్ - వి­శా­ఖ­ప­ట్నం (20707) వం­దే­భా­ర­త్ ప్ర­స్తు­తం సి­కిం­ద్రా­బా­ద్ నుం­చి 5.05 గం­ట­ల­కు బయ­ల్దే­రు­తుం­డ­గా..జన­వ­రి 1 నుం­చి 5 గం­ట­ల­కే బయ­ల్దే­ర­నుం­ది.

సి­కిం­ద్రా­బా­ద్ - సి­ర్పూ­ర్ కా­గ­జ్ నగర్ ఎక్స్ ప్రె­స్ (12757) ఉదయం 8.20కి బదు­లు­గా 8.10 గం­ట­ల­కు, సి­కిం­ద్రా­బా­ద్ - భద్రా­చ­లం (17659) కా­క­తీయ ఎక్స్ ప్రె­స్ 5.25కి బదు­లు­గా 5 గం­ట­ల­కు బయ­ల్దే­ర­ను­న్నా­యి. అలా­గే ఆధా­ర్ అథం­టి­కే­టె­డ్ రి­జ­ర్వే­ష­న్లు.. తొలి 15 ని­మి­షాల వరకే ఉం­డ­గా.. డి­సెం­బ­ర్ 29 నుం­చి ఈ సమ­యం­లో 4 గం­ట­ల­కు పె­రి­గిం­ది. అంటే.. ఉదయం 8 గంటల నుం­చి 12 గంటల వరకూ ఆథా­ర్ అథం­టి­కే­టె­డ్ అకౌం­ట్లు ఉన్న­వా­రు మా­త్ర­మే టి­కె­ట్ల­ను రి­జ­ర్వే­ష­న్ చే­సు­కో­గ­ల­రు. జన­వ­రి 5 నుం­చి ఈ సమయం సా­యం­త్రం 4 గంటల వరకు, 12వ తేదీ నుం­చి రా­త్రి 12 గంటల వరకూ పం­చ­నుం­ది.

వేతన కమిషన్

2025 డి­సెం­బ­ర్ 31తో 7వ వేతన కమి­ష­న్ గడు­వు ము­గి­య­నుం­ది. జన­వ­రి 1 నుం­చి 8వ వేతన కమి­ష­న్ ప్రా­రం­భం కా­నుం­ది. దీ­ని­పై ప్ర­భు­త్వం ని­ర్ణ­యం తీ­సు­కో­క­పో­యి­నా.. వేతన పెం­పు ని­ర్ణ­యా­లు జన­వ­రి 1 నుం­చి అమ­ల్లో­కి రా­ను­న్నా­యి. ఫలి­తం­గా ప్ర­భు­త్వ ఉద్యో­గు­ల­కు, పె­న్ష­న­ర్ల­కు ఊరట లభిం­చ­నుం­ది. జన­వ­రి 1 నుం­చి కా­ర్లు, బై­కుల ధరలు పె­ర­గ­ను­న్నా­యి. బెం­జ్, బీ­ఎం­డ­బ్ల్యూ, ని­స్సా­న్, రెనో, జే­ఎ­స్ డబ్ల్యూ, ఎంజీ మో­టా­ర్, బీ­వై­డీ కం­పె­నీ­లు కారల ధర­ల­ను పెం­చు­తు­న్న­ట్లు ప్ర­క­టిం­చా­యి. బైక్ తయా­రీ సం­స్థ ఏథర్ ఎన­ర్జీ కూడా స్కూ­ట­ర్ల­పై రూ.3 వేలు పెం­చు­తు­న్న­ట్లు ప్ర­క­టిం­చిం­ది. ఇక ఎల్పీ­జీ, కమ­ర్షి­య­ల్ గ్యా­స్, ఏటీ­ఎ­ఫ్ ధర­ల­ను ప్ర­తీ నెల 1న చము­రు కం­పె­నీ­లు సవ­రి­స్తా­య­న్న వి­ష­యం తె­లి­సిం­దే. కొ­త్త సం­వ­త్స­రం­లో కమ­ర్షి­య­ల్ సి­లిం­డ­ర్ ధర తగ్గే ఛా­న్స్ ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. 2026లో మరి­న్ని కీలక మా­ర్పు­లు వచ్చే అవ­కా­శం ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది.

Tags

Next Story