32 సంవత్సరాల వైవాహిక జీవితం.. మిలియనీర్ కొత్త నిర్ణయం
![32 సంవత్సరాల వైవాహిక జీవితం.. మిలియనీర్ కొత్త నిర్ణయం 32 సంవత్సరాల వైవాహిక జీవితం.. మిలియనీర్ కొత్త నిర్ణయం](https://www.tv5news.in/h-upload/2023/11/13/1113919-gautam-singhania.webp)
భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరు గౌతమ్ సింఘానియా (58). అతను కోట్లాది రూపాయల లగ్జరీ దుస్తుల రిటైలర్ రేమండ్స్ గ్రూప్కు ఛైర్మన్. హై-స్పీడ్ కార్లను కొనుగోలు చేయడం, కార్ల పోటీలలో పాల్గొనడం అతడికి ఇష్టం. గౌతమ్ సింఘానియా 1999లో నవాజ్ మోదీ సింఘానియాను వివాహం చేసుకున్నారు. ఆమె ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తుంటారు. కొన్ని నెలలుగా సింఘానియా దంపతుల మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం, మహారాష్ట్రలోని థానేలో సింఘానియా గ్రూపుకు చెందిన అతిపెద్ద ఫామ్హౌస్లో దీపావళి పార్టీ జరిగింది. గౌతమ్ భార్య నవాజ్కు హాజరుకావడానికి అనుమతి నిరాకరించడంతో గేటు దగ్గరే ఆమెను నిర్బంధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నవాజ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ సందర్భంలో, గౌతమ్ తన అధికారిక X ఖాతాలో ఒక సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశారు. అందులో అతను ఇలా పేర్కొన్నారు.
మా 32 ఏళ్ల వైవాహిక జీవితం ముగియనుంది. మా పరస్పర ప్రేమ జీవితం గురించి చాలా మంది అసభ్యకరంగా చర్చించుకుంటున్నారు. నేను, నవాజ్ ఇక నుండి వేర్వేరు దిశల్లో ప్రయాణించబోతున్నామని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మా ఇద్దరి పిల్లలకు చేయాల్సిన బాధ్యతలన్నీ చేస్తాం. దయచేసి మా వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించండి అని అందులో పేర్కొన్నారు.
గౌతమ్ సింఘానియా.. నవాజ్ మోదీని 1999లో పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందు ఇద్దరూ 8 సంవత్సరాలు డేటింగ్ చేశారు. రెండేళ్ల కిందట గౌతమ్ సింఘానియా.. తన తండ్రి విజయ్పథ్తో విభేదాల కారణంగా వార్తల్లోకెక్కారు. మళ్లీ ఇప్పుడు 32 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ వార్తల్లోకి ఎక్కుతున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా కంటే ఎక్కువ విలువ రూ. 15,000 కోట్లతో గౌతమ్ 10 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జేకే హౌస్లో నివాసం ఉంటున్న ఆయన ఇంటి విలువ రూ. 6000 కోట్లు, భారతదేశంలో రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు ఆయనదే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com