బంగారం వ్యాపారి సుఖేష్ గుప్తకు ఈడీ భారీ షాక్..

బంగారం వ్యాపారి సుఖేష్ గుప్తకు ఈడీ భారీ షాక్..
ప్రముఖ బంగారం వ్యాపారి సుఖేష్ గుప్తకు ఈడీ భారీ షాకిచ్చింది. ఈడీ చరిత్రలోనే తొలిసారిగా 222 కోట్ల 44 లక్షల జరిమానా విధించింది. ఎంబీఎస్ జ్యూవెల్లరీకి జరిమానా విధించినట్లు..

ప్రముఖ బంగారం వ్యాపారి సుఖేష్ గుప్తకు ఈడీ భారీ షాకిచ్చింది. ఈడీ చరిత్రలోనే తొలిసారిగా 222 కోట్ల 44 లక్షల జరిమానా విధించింది. ఎంబీఎస్ జ్యూవెల్లరీకి జరిమానా విధించినట్లు తెలిపింది. హాంకాంగ్‌కు డైమాండ్ ఎక్స్‌పోర్టు చేసిన విషయంలో ఈడి ఫెమా కేసు నమోదు చేసింది. నిబంధనలు ఉల్లంఘించి విదేశీ ట్రాన్సక్షన్లు నిర్వహించినట్లు గుర్తించిన ఈడీ ఈ జరిమానా వేసింది. ఈ కేసులో సుఖేష్ గుప్తాకు వ్యక్తిగతంగా 22కోట్లు, ఎంబీఎస్ జ్యూవెల్లరీకి 222 కోట్ల 44లక్షల జరిమానా విధించినట్లు తెలిపింది. హాంకాంగ్‌కు డైమండ్ ఎక్స్‌పోర్ట్ లో హవాల ద్వారా పెద్ద ఎత్తున నిధుల మార్పిడి జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా హాంకాంగ్ కంపెనీతో ఒప్పందం చేసుకొని, డైమండ్ వ్యాపారం చేయడంపై ఈడీ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఎంబీఎస్ పై ఫెమా కేసు నమోదు చేసి విచారణ చేపట్టి అరెస్టు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story