HYD: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కొత్త చిరునామా..హైదరాబాద్‌

HYD: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కొత్త చిరునామా..హైదరాబాద్‌
X
జీసీసీలకు హబ్‌గా హైదరాబాద్‌ దూసుకుపోతుంది.. బెంగళూరు తర్వాత కీలక స్థానం దక్కించుకున్న హైదరాబాద్.. హైదరాబాద్‌లో జీసీసీలకు పెరుగుతున్న డిమాండ్

భారతదేశంలో బహుళజాతి సంస్థల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC) ఏర్పాటు ఊపందుకుంటోంది. ఈ తరహా కేంద్రాల ఆకర్షణలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ కీలక స్థానాన్ని దక్కించుకుంటోంది. వి­విధ దే­శా­ల­కు చెం­దిన బహు­ళ­జా­తి కం­పె­నీ­లు (MNCs) ఇటీ­వల కా­లం­లో మన­దే­శం­లో అధి­కం­గా జీ­సీ­సీ­ల­ను ఏర్పా­టు చే­స్తుం­డ­గా, వీ­టి­లో ఎక్కువ భా­గా­న్ని హై­ద­రా­బా­ద్ నగరం ఆక­ర్షి­స్తోం­ది. ము­ఖ్యం­గా బీ­ఎ­ఫ్‌­ఎ­స్‌ఐ (బ్యాం­కిం­గ్, ఫై­నా­న్షి­య­ల్ సర్వీ­సె­స్, ఇన్సూ­రె­న్స్) మరి­యు ఫా­ర్మా రం­గా­ల­కు చెం­దిన జీ­సీ­సీ­లు ఇక్కడ వి­స్తృ­తం­గా నె­ల­కొం­టు­న్నా­యి. హై­ద­రా­బా­ద్‌­లో ఐటీ­తో పాటు ఫా­ర్మా, బయో­టె­క్నా­ల­జీ రం­గాల ప్రా­బ­ల్యం, అలా­గే ఫై­నా­న్షి­య­ల్ డి­స్ట్రి­క్ట్‌­లో ఇప్ప­టి­కే అం­త­ర్జా­తీయ ఆర్థిక సం­స్థ­లు ఉం­డ­టం వంటి అం­శా­లు ఈ కం­పె­నీ­లు కొ­త్త జీ­సీ­సీల కోసం హై­ద­రా­బా­ద్‌­ను ఎం­చు­కో­వ­డా­ని­కి ప్ర­ధాన కా­ర­ణా­లు­గా ని­లు­స్తు­న్నా­యి. ఈ పె­రు­గు­తు­న్న ఆక­ర్షణ స్థా­ని­కం­గా స్థి­రా­స్తి రం­గా­ని­కి, ము­ఖ్యం­గా వా­ణి­జ్య స్థ­లా­ని­కి గి­రా­కీ­ని పెం­చు­తుం­ద­ని అం­చ­నా.

హైదరాబాద్‌, బెంగళూరు, పుణెలే కీలకం

కన్సల్టింగ్ సేవల సంస్థ అయిన సావిల్స్ ఇండియా నివేదిక ప్రకారం, హైదరాబాద్ నగరంలో వివిధ సంస్థలు తమ జీసీసీల కోసం 2020-24 మధ్యకాలంలో 1.86 కోట్ల చదరపు అడుగుల భవన నిర్మాణ స్థలాన్ని తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా జీసీసీలు వినియోగిస్తున్న మొత్తం స్థలంలో ఇది 17% కావడం విశేషం. ఈ విషయంలో బెంగళూరు తర్వాతి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. నిజానికి, మనదేశంలో జీసీసీలు అధికంగా బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాల్లో ఏర్పాటవుతున్నాయి. దేశవ్యాప్తంగా జీసీసీలు అద్దెకు తీసుకుంటున్న మొత్తం భవన నిర్మాణ స్థలంలో ఈ మూడు నగరాల వాటా 86 శాతంగా ఉంది.

భవిష్యత్తు అంచనాలు: 2030 నాటికి మరింత వృద్ధి

ప్ర­స్తు­తం భా­ర­త­దే­శం­లో 1,800 జీ­సీ­సీ­లు ఉం­డ­గా, వీ­టి­లో 19 లక్షల మంది ఉద్యో­గు­లు పని­చే­స్తు­న్నా­రు. 2030 నా­టి­కి జీ­సీ­సీల సం­ఖ్య 2,200కు, ఉద్యో­గుల సం­ఖ్య 28 లక్ష­ల­కు చేరే అవ­కా­శం ఉం­ద­ని అం­చ­నా. ఐటీ, బీ­ఎ­ఫ్‌­ఎ­స్‌ఐ, ఇం­జి­నీ­రిం­గ్-మ్యా­ను­ఫ్యా­క్చ­రిం­గ్, ఫా­ర్మా, రి­టై­ల్, కన్జూ­మ­ర్ సర్వీ­సె­స్ వి­భా­గా­ల్లో కొ­త్త క్ల­స్ట­ర్లు ఏర్ప­డ­టం ఈ వి­స్త­ర­ణ­కు వీలు కల్పి­స్తుం­ది. సా­వి­ల్స్ ఇం­డి­యా వి­శ్లే­షణ ప్ర­కా­రం, 2025-30 మధ్య­కా­లం­లో అద­నం­గా 3 కో­ట్ల చద­ర­పు అడు­గుల ని­ర్మాణ స్థ­లా­న్ని భా­ర­త్‌­లో జీ­సీ­సీ­లు అద్దె­కు తీ­సు­కు­నే అవ­కా­శం ఉంది. ఆటో­మో­టి­వ్, లై­ఫ్‌­సై­న్సె­స్, సె­మీ­కం­డ­క్ట­ర్ జీ­సీ­సీ­లు అధి­కం­గా ఏర్పా­టు కా­వొ­చ్చ­ని అం­చ­నా.

భారత్‌ను ఎంచుకోవడానికి కారణాలు

భారతదేశంలో అధికంగా నిపుణుల లభ్యత, తక్కువ నిర్వహణ వ్యయాలు, సానుకూల ప్రభుత్వ విధానాలు, పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలకు పెద్దపీట వేయడం వంటి అంశాలు జీసీసీలను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తున్నాయి. అంతేగాక, దేశంలో పర్యావరణ అనుకూల సదుపాయాలు, హైబ్రిడ్ పని విధానాలు, వ్యూహాత్మక నగరాల ఎంపిక జీసీసీల విస్తరణను ప్రభావితం చేస్తున్నాయని సావిల్స్ ఇండియా ఎండీ అర్వింద్ నందన్ వివరించారు. హైదరాబాద్‌లో త్వరలో మూడు అగ్రశ్రేణి బహుళజాతి సంస్థల జీసీసీలు ఏర్పాటు కానున్నాయి. యూఎస్ ఆధారిత రిటైల్ దిగ్గజం కాస్ట్‌కో, యూఎస్ ఆధారిత ఆర్థిక సేవల సంస్థ వెస్ట్రన్ యూనియన్, యూకేకు చెందిన సరకు రవాణా సేవల సంస్థ స్టోల్ట్-నీల్సన్ ఇక్కడ తమ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి.

Tags

Next Story