Cyrus Mistry : సైరస్ మిస్త్రీ గురించి ఆసక్తికరమైన విషయాలు..

Cyrus Mistry : సైరస్ మిస్త్రీ గురించి ఆసక్తికరమైన విషయాలు..
Cyrus Mistry : సైరస్ మిస్త్రీ దుర్మరణం కార్పొరేట్ ప్రపంచాన్ని ఒక్కసారి దిగ్భ్రాంతికి గురి చేసింది.

Cyrus Mistry : సైరస్ మిస్త్రీ దుర్మరణం కార్పొరేట్ ప్రపంచాన్ని ఒక్కసారి దిగ్భ్రాంతికి గురి చేసింది. అతి చిన్న వయసులోనే ఓ బడా కంపెనీకి మ్యానెజింగ్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టాడు సైరస్ మిస్త్రీ. ఆయన గురించిన మరిన్ని ఆసక్తి విషయాలు.

  • టాటా సన్స్ గ్రూప్‌లో సింగిల్ లార్జెస్ట్ షేర్ హోల్డర్‌గా.. అత్యధికంగా 18.5 శాతం వాటా కలిగి ఉన్నారు సైరస్ మిస్ట్రీ.
  • 2012లో రతన్ టాటా రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత టాటా సన్స్‌కు ఆరవ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు
  • 26 ఏళ్ల వయసులోనే తండ్రికి చెందిన షాపూర్జీ పల్లోన్జీ కన్స్‌ట్రాక్షన్ గ్రూపు కంపెనీకి ఎండీగా బాధ్యతలు చేపట్టారు.
  • మిస్త్రీ తల్లిది ఐరిష్ దేశం అయినప్పటికీ ఆయన ముంబైలో 1968 జులై 4న జన్మించారు
  • లండన్‌లోని ఇంపీరియన్ కాలేజ్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌ను పూర్తి చేశారు. 1997లో లండన్ బిజినెస్ స్కూల్‌ నుంచి మ్యానేజ్మెంట్‌లో ఎమ్మెస్సీ కంప్లీట్ చేశారు.
  • మిస్త్రీ సొంత కంపెనీ అయిన షాపూర్జీ పల్లోన్జీ గ్రూపు సంస్థలను అందనంత ఎత్తుకు తీసుకెళ్లి డెవలప్ చేశారు.
  • 2016 అక్టోబర్‌ను టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకొని కోర్టుల్లో దాని పై సుదీర్ఘంగా పోరాడారు.
  • సైరస్‌కు ఇద్దరు సోదరీమణులు, లైలా, అలూ.. రతన్ టాటా సోదరుడు నెయెల్ టాటా అలూను వివాహమాడారు.
  • మిస్త్రీ చాలా మృదు స్వభావి, అందరితో కలిసిపోయే తత్వం.. కార్లు.. అందుటో ఎస్‌యూవీలంటే విపరీతమైన ఇష్టం
  • హార్స్ రైడింగ్ అంటే మిస్త్రీకి అమితమైన ప్రేమ.. పూణెలోని తన సొంత 200 ఎకరాల పొలంలో హార్స్ రైడింగ్ చేసేవారు.
  • ఆటోమొబైల్ దిగ్గజానికి చైర్మన్‌గా పనిచేసినా.. హై స్పీడ్లో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల మరణించడం ఓ యాదృచ్ఛికం

Tags

Read MoreRead Less
Next Story