ఐటీ ఫైలింగ్ గడువు పెంచిన ప్రభుత్వం
ఆదాయపు పన్నుకు సంబంధించి 2018-19 రిటర్న్స్ దాఖలుకు తుది గడువును CBDTమరో రెండు నెలలు పొడిగించింది. గతంలో ఇచ్చిన సమయం సెప్టెంబర్తో ముగిసిపోయింది. కోవిడ్-19 నేపథ్యంలో రిటర్న్స్ దాఖలు విషయంలో కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గడువు పొడిగింపు ఇది నాల్గవసారి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి అసెస్మెంట్ ఇయర్ 2019–20 అవుతుంది. అంటే 2020 మార్చినాటికి 2018–19 ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే దీనిని తొలుత జూన్ 30 వరకూ సీబీడీటీ పొడిగించింది. మళ్లీ జూలై 31 వరకూ పెంచింది. జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది.
మరోవైపు 2018-19 వస్తు సేవల పన్ను -GST రిటర్న్స్, ఆడిట్ రిపోర్ట్ దాఖలుకు గడువును మరోనెల పొడిగించింది. అక్టోబర్ 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్డ్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రకటించింది. మేలో ఈ గడువును సీబీఐసీ మూడు నెలల పాటు అంటే సెప్టెంబర్ వరకూ పొడిగించింది. కరోనా కారణంగానే నిర్ణయం తీసుకుంది.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com