INFOSYS: ఇన్ఫీ సీఈఓ వేతనం.. ఏడాదికి రూ.80.6 కోట్లు

INFOSYS: ఇన్ఫీ సీఈఓ వేతనం.. ఏడాదికి రూ.80.6 కోట్లు
X
ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ వార్షిక వేతనం 2025 ఆర్థిక సంవత్సరానికి భారీగా పెంపు

ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ వార్షిక వేతనం 2025 ఆర్థిక సంవత్సరానికి భారీగా పెరిగింది. కంపెనీ విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక ప్రకారం, పరేఖ్‌ పారితోషికం గత సంవత్సరంతో పోల్చితే 22 శాతం పెరిగి రూ.80.6 కోట్లకు చేరుకుంది. వేతనంలో ఈ పెరుగుదల ప్రధానంగా ఆయనకు కేటాయించిన నియంత్రిత స్టాక్ యూనిట్లు (RSUs) విలువ పెరగడం వల్లేనని సంస్థ పేర్కొంది. సలీల్‌ పరేఖ్‌ ఈ ఏడాది స్టాక్ ఆప్షన్ల ద్వారానే రూ.49.5 కోట్లు సంపాదించారు. గత ఆర్థిక సంవత్సరంలో అదే ఆదాయం రూ.39 కోట్లు మాత్రమే.

2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌కు పోటీగా ఉన్న టీసీఎస్, విప్రో వంటి కంపెనీ సీఈఓల వేతనం కంటే కూడా సలీల్‌ ప్యాకేజీ అధికంగా ఉండడం గమనార్హం. అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ ఎగుమతిదారుగా ఉన్న టీసీఎస్ సీఈఓ, ఎండీ కె.కృతివాసన్ వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతం పెరిగి రూ.26.5 కోట్లకు చేరుకుంది. విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ పలియా వేతనం 10 శాతం పెరిగి 6.2 మిలియన్ డాలర్లకు లేదా సుమారు రూ.53.6 కోట్లకు చేరుకుంది.

ఇతర కంపెనీలతో పోలిస్తే పరేఖ్ వేతనం ఎలాగుంది?

టీసీఎస్ సీఈఓ కృతివాసన్ వేతనం: రూ.26.5 కోట్లు (4.6% పెరుగుదల)

విప్రో సీఈఓ శ్రీనివాస్ పలియా వేతనం: రూ.53.6 కోట్లు (సుమారు $6.2 మిలియన్, 10% అంటే, టాప్ ఐటీ కంపెనీల సీఈఓలతో పోలిస్తే పరేఖ్‌ వేతనం అత్యధికంగా ఉండటం గమనార్హం.

పరేఖ్‌ వేతన వివరాలు:

బేసిక్ పే: రూ.7.5 కోట్లు

రిటైర్మెంట్ బెనిఫిట్స్: రూ.50 లక్షలు

వేరియబుల్ పే: రూ.23.2 కోట్లు (గత ఏడాది రూ.19.8 కోట్లు)

ఇన్ఫోసిస్ ఉద్యోగుల సగటు వేతనం రూ.10.72 లక్షలు కాగా, పరేఖ్‌ వేతనం అందరితో పోలిస్తే భారీ వ్యత్యాసాన్ని సూచిస్తోంది.

Tags

Next Story