IT SECTOR: ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఐటీ ప్రపంచం

IT SECTOR: ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఐటీ ప్రపంచం
X
తీవ్ర అలజడి రేపుతున్న వరుస ఆత్మహత్యలు

హై­ద­రా­బా­ద్ నగ­రం­లో­ని ఖై­ర­తా­బా­ద్‌­లో చో­టు­చే­సు­కు­న్న ఒక వి­షాద ఘటన మరో­సా­రి మన సమా­జా­న్ని కల­చి­వే­సిం­ది. వరం­గ­ల్‌­కు చెం­దిన 30 ఏళ్ల తరు­ణ్ అనే సా­ఫ్ట్‌­వే­ర్ ఇం­జ­నీ­ర్ రైలు కింద పడి ఆత్మ­హ­త్య చే­సు­కో­వ­డం కే­వ­లం ఒక కు­టుం­బా­న్ని మా­త్ర­మే కాదు, దే­శ­వ్యా­ప్తం­గా ఐటీ రం­గం­లో పని­చే­స్తు­న్న వే­లా­ది మంది యువత మన­స్త­త్వ స్థి­తి­పై పె­ద్ద ప్ర­శ్నా­ర్థక చి­హ్నా­న్ని ము­ద్రిం­చిం­ది. భా­ర్య, మూ­డే­ళ్ల చి­న్నా­రి కూ­తు­రు­తో బయ­ట­కు సా­ధా­రణ జీ­వి­తం గడు­పు­తు­న్న­ట్టే కని­పిం­చిన తరు­ణ్, గత ఏడా­ది నుం­చి మా­న­సిక సమ­స్య­ల­తో బా­ధ­ప­డు­తూ చి­కి­త్స తీ­సు­కుం­టు­న్నా­డ­ని తె­లి­సిం­ది. అయి­న­ప్ప­టి­కీ, మం­గ­ళ­వా­రం ఉదయం ఇంటి నుం­చి బయ­ట­కు వె­ళ్లిన ఆయన ఖై­ర­తా­బా­ద్ రై­ల్వే గేట్ రైలు ముం­దు పడి­పో­వ­డం సమా­జా­ని­కి మళ్లీ చేదు ని­జా­న్ని గు­ర్తు చే­సిం­ది. ఐటీ రం­గం­లో మా­న­సిక ఆరో­గ్య సం­క్షో­భం పె­రు­గు­తోం­ది.

అంకెల్లో కనిపిస్తున్న ఆందోళన

ఇది ఒక్క ఘటన మా­త్ర­మే కాదు. ఇటీ­వ­లి సం­వ­త్స­రా­ల్లో దే­శ­వ్యా­ప్తం­గా సా­ఫ్ట్‌­వే­ర్ ఇం­జి­నీ­ర్ల ఆత్మ­హ­త్య­లు పె­రు­గు­తు­న్నా­యి. 2022లో భా­ర­త­దే­శం­లో మొ­త్తం 1,71,000 మంది ఆత్మ­హ­త్య­లు చే­సు­కు­న్న­ట్లు అధి­కా­రిక గణాం­కా­లు చె­బు­తు­న్నా­యి. ప్ర­తి లక్ష మం­ది­కి 12.4 మంది ఆత్మ­హ­త్య చే­సు­కో­వ­డం, ప్ర­పంచ సగటు 9.2 కంటే ఎక్కువ. ఐటీ రం­గా­ని­కి ప్ర­త్యే­కం­గా సమ­గ్ర డేటా లే­క­పో­యి­నా, 2017 నుం­చి 2025 మధ్య కా­లం­లో 227 ఐటీ ఉద్యో­గుల ఆత్మ­హ­త్య­లు నమో­దై­న­ట్లు రి­పో­ర్టు­లు సూ­చి­స్తు­న్నా­యి. ప్ర­త్యే­కం­గా బెం­గ­ళూ­రు, హై­ద­రా­బా­ద్, చె­న్నై, పుణె వంటి ఐటీ హబ్‌­ల­లో ఈ ఘట­న­లు అధి­కం­గా కని­పి­స్తు­న్నా­యి. సర్వే­లు చె­బు­తు­న్న­దే­మి­టం­టే 83% ఐటీ ఉద్యో­గు­లు తీ­వ్ర పని ఒత్తి­డి­తో అల­సి­పో­తు­న్నా­రు. 25% మంది వా­రా­ని­కి 70 గం­ట­ల­కు­పై­గా పని చే­స్తు­న్నా­రు. హై­ద­రా­బా­ద్‌­లో జరి­గిన ఒక అధ్య­య­నం ప్ర­కా­రం 84% ఐటీ ఉద్యో­గు­ల్లో లి­వ­ర్ సమ­స్య­లు ఉన్న­ట్లు వె­ల్ల­డైం­ది. అధిక స్ట్రె­స్, శా­రీ­రక శ్రమ లే­క­పో­వ­డం వల్ల వస్తు­న్నా­యట. కర్ణా­ట­క­లో ఆర్గ­న్ ట్రా­న్స్‌­ప్లాం­ట్ కోసం ఎదు­రు­చూ­స్తు­న్న వా­రి­లో 20% మంది ఐటీ ప్రొ­ఫె­ష­న­ల్స్ ఉం­డ­టం ఆ రం­గం­లో ఆరో­గ్య సమ­స్యల తీ­వ్ర­త­ను సూ­చి­స్తోం­ది. 51.2% ఐటీ ఇం­జి­నీ­ర్లు వర్క్ స్ట్రె­స్‌­తో, 36% మంది మా­న­సిక రు­గ్మ­త­ల­తో బా­ధ­ప­డు­తు­న్నా­రు.సా­ఫ్ట్‌­వే­ర్ ఉద్యో­గా­లు ఇప్పు­డు ప్ర­పం­చం­లో అత్య­ధిక ఒత్తి­డి కలి­గిన వృ­త్తు­ల­లో ఒక­టి­గా మా­రా­యి. దీ­ర్ఘ­కా­లిక పని గం­ట­లు, కఠి­న­మైన డె­డ్‌­లై­న్స్, ని­రం­తర ఓవ­ర్‌­టై­మ్, కం­ప్యూ­ట­ర్ ముం­దు గంటల తర­బ­డి కూ­ర్చు­నే జీ­వ­న­శై­లి శా­రీ­రక–మా­న­సిక ఆరో­గ్యా­న్ని దె­బ్బ­తీ­స్తు­న్నా­యి. కొ­న్ని కం­పె­నీ­ల్లో 70 నుం­చి 90 గంటల వర్క్ వీక్ సా­ధా­ర­ణం­గా మా­రిం­ది. ఇది­కా­కుం­డా, జాబ్ ఇన్‌­సె­క్యూ­రి­టీ మరో పె­ద్ద భయం. ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­టె­లి­జె­న్స్, ఆటో­మే­ష­న్ పె­రు­గు­తు­న్న నే­ప­థ్యం­లో 2025లోనే 6,000కు­పై­గా లే­ఆ­ఫ్స్ జరి­గి­న­ట్లు సమా­చా­రం. ప్ర­తి సం­వ­త్స­రం సు­మా­రు 15 లక్షల ఇం­జి­నీ­రిం­గ్ గ్రా­డ్యు­యే­ట్లు బయ­ట­కు వస్తు­న్నా, కే­వ­లం 10% మం­ది­కే సరైన ఉద్యో­గా­లు లభి­స్తు­న్నా­యి. ఉద్యో­గం ఉన్న­వా­రి­లో­నూ “రేపు ఏమ­వు­తుం­దో?” అనే భయం వెం­టా­డు­తోం­ది.

ఈ పరి­స్థి­తి­ని మా­ర్చా­లం­టే ఐటీ రం­గం­లో తక్షణ చర్య­లు తీ­సు­కో­వా­లి. కం­పె­నీ­లు ఉద్యో­గుల కోసం మెం­ట­ల్ హె­ల్త్ ప్రో­గ్రా­మ్స్, ఎం­ప్లా­యీ అసి­స్టె­న్స్ ప్రో­గ్రా­మ్స్ (EAP), వర్క్–లైఫ్ బ్యా­లె­న్స్ వి­ధా­నా­లు, “రైట్ టు డి­స్‌­క­నె­క్ట్” వంటి పా­ల­సీ­ల­ను అమలు చే­యా­లి. ప్ర­భు­త్వం లే­బ­ర్ చట్టా­ల­ను కఠి­నం­గా అమలు చేసి, మెం­ట­ల్ హె­ల్త్ డే­టా­ను సే­క­రిం­చి, నే­ష­న­ల్ మెం­ట­ల్ హె­ల్త్ ప్రో­గ్రా­మ్‌­ను బలో­పే­తం చే­యా­లి. వ్య­క్తి­గ­తం­గా కూడా సమ­స్య­ల­ను దా­చి­పె­ట్ట­కుం­డా, స్నే­హి­తు­ల­తో మా­ట్లా­డ­టం, అవ­స­ర­మై­తే ప్రొ­ఫె­ష­న­ల్ సహా­యం తీ­సు­కో­వ­డం అత్యంత ము­ఖ్యం.

Tags

Next Story