సెంచరీ కొట్టేందుకు సిద్ధమైన పెట్రో ధర.. వెయి రూపాయలే లక్ష్యంగా గ్యాస్ ధర!
By - Nagesh Swarna |15 Feb 2021 3:00 PM GMT
సిలిండర్ ధర పెరిగినా.. సబ్సిడీ పెరగడం లేదని మండిపడుతున్నారు ప్రజలు.
పెట్రోల్ , డీజిల్ ధరలు సెంచరీ కొట్టేందుకు సిద్ధమైతే.. నేనేమ్ తక్కువంటూ వెయి రూపాయలే లక్ష్యంగా గ్యాస్ ధరలు దూసుకుపోతున్నాయి. గడిచిన 3 నెలల్లో సుమారు 200 రూపాయలకు పైగా గ్యాస్ ధరలు పెరిగాయి. గత నెలలో 50 చొప్పున రెండు సార్లు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. తాజాగా 50 రూపాయాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర 820 రూపాయలకు చేరింది. సిలిండర్ ధర పెరిగినా.. సబ్సిడీ పెరగడం లేదని మండిపడుతున్నారు వినియోగదారులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com