Yangmila Zimik: కేవలం రూ. 500తో వ్యాపారం ప్రారంభించి.. నెలకు రూ. 80వేలు సంపాదిస్తూ..

Yangmila Zimik: యాంగ్మిలా జిమిక్, ఒంటరి తల్లి వ్యాపారవేత్తగా మారారు. ఆమె మొదట తన స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం గూస్బెర్రీ క్యాండీలు చేసి రుచి చూపించింది. అక్కడే తన వ్యాపారానికి పునాది పడింది. అవి రుచికరంగా ఉన్నాయని మరిన్ని తయారు చేయమని ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతో ఆమె మరిన్ని ఉత్పత్తులను తయారు చేసింది. అవి కూడా సక్సెస్ కావడంతో 2019లో షిరిన్ ఉత్పత్తులను స్థాపించింది. గ్రామీణ విభాగంలో ఆమె ప్రతిభకు మంచి గుర్తింపు లభించింది. యాంగ్మిలా ఇటీవల అస్సాం మహిళా పారిశ్రామికవేత్తల అవార్డును గెలుచుకుంది.
ఏడేళ్ల క్రితం, మణిపూర్కు చెందిన యాంగ్మిలా ఫుడ్ ప్రాసెసింగ్పై శిక్షణా కార్యక్రమానికి హాజరైనప్పుడు చాలా విషయాలు నేర్చుకుంది. వర్క్షాప్ ముగిసిన వెంటనే, యాంగ్మిలా ఒక చిన్న తరహా వెంచర్ను ప్రారంభించడానికి తగినంత ప్రోత్సాహాన్ని పొందింది.
రూ.500 లతో జామకాయలు, పంచదార కొనుక్కొని, మిఠాయిలు తయారు చేసివాటిని చిన్న చిన్న పాకెట్లుగా చేసి స్థానిక దుకాణాలకు అందజేసింది. అవి అమ్ముడవుతాయో లేదో అని ఆందోళన చెందింది. కానీ అవి వేగంగా అమ్ముడవడంతో తనలో ఉత్సాహం వచ్చింది.
యాంగ్మిలాకు తెలిసిన భాష మెయిటీ. నేడు తానొక వ్యాపారవేత్తగా మారడానికి 47 ఏళ్ల యాంగ్మిలాకు భాష అడ్డంకి కాలేదు. ఆమె తన స్వంత లేబుల్ 'షిరిన్' ఉత్పత్తులతో పేరును సంపాదించుకుంది. యాంగ్మిలా తయారు చేసిన స్వీట్లకు మంచి గిరాకీ లభించింది.
ఉఖ్రుల్ అనే చిన్న పట్టణంలోని అనేక కిరాణా దుకాణాలు మరిన్ని ఉత్పత్తుల కోసం ఆమెను సంప్రదించాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఉత్పత్తుల తయారీ కోసం ఎక్కువ సమయాన్ని పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. ప్రయోగాలు చేయడం ఆమెకు మొదటి నుంచి ఇష్టం. ఇందుకోసం స్థానికంగా లభించే గూస్బెర్రీ, ప్లం, జామపండ్లు, వైల్డ్ ఆలివ్ మొదలైన పండ్లను సేకరించి, వాటితో ఉఖ్రుల్లోని తన నివాసంలో క్యాండీలు మరియు జామ్లు తయారు చేయడం ప్రారంభించింది.
2017లో, స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం (కెవికె)లో ఊరగాయ తయారీ నేర్చుకునేందుకు జరిగిన మరో వర్క్షాప్కు హాజరైనప్పుడు, ఆమె ఆసక్తి మరియు ఉత్సాహం కెవికెలోని అధికారుల దృష్టిని ఆకర్షించింది. సోషియో-ఎకనామిక్ యాక్షన్ ప్లాన్ (SEAP) కింద ఆమెకు కట్టెల పొయ్యి, గ్యాస్ స్టవ్ మరియు జంబో బాక్స్ను అందించడం ద్వారా ఆమె ఇంటి వద్ద ఒక చిన్న వర్కింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడంలో వారు ఆమెకు సహాయం చేశారు.
క్యాండీలు మరియు జామ్ల నుండి వివిధ రకాల ఊరగాయల వరకు, తన ఉత్పత్తులను విస్తరించడం ప్రారంభించింది. ఆమె తన బ్రాండ్ షిరిన్ ఉత్పత్తుల పేరుతో ఇప్పుడు 35 రకాల ఆహార ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఆమె తనకు పనిలో సహాయంగా ఆరుగురు స్థానిక మహిళలను, పార్ట్టైమ్గా పనిచేసేందుకు ఇద్దరు విద్యార్థులను కూడా నియమించుకుంది.
యాంగ్మిలా విద్యార్థులు తమ చదువును పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పింది, ఎందుకంటే తనకు చదువుకునే అవకాశం లేకపోయింది అని తెలిపింది. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లి చనిపోయింది, నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆరుగురు తోబుట్టువులు దాంతో విద్యను కొనసాగించడం కష్టంగా మారింది అని చెప్పింది.
తన ఏకైక కుమారుడు ఫారెస్ట్రీలో మాస్టర్స్ను అభ్యసిస్తున్నాడు. యాంగ్మిలా స్వయంగా ఉఖ్రుల్ జిల్లాలో దాదాపు 30-50 దుకాణాలకు ఈ ఉత్పత్తులను పంపిణీ చేస్తుంది. నెలకు రూ. 70,000 నుండి రూ. 80,000 వరకు సంపాదిస్తున్నట్లు తెలిపింది. యాంగ్మిలా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ (PM FME స్కీమ్) యొక్క ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ కోసం దరఖాస్తు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com