Mukesh Ambani: భరతనాట్యంతో ఆకట్టుకున్న ముకేశ్ అంబానీ కాబోయే కోడలు..
Mukesh Ambani: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కాబోయే కోడలు రాధిక భరతనాట్యంతో ఆకట్టుకున్నారు. ముకేష్ అంబానీ రెండో తనయుడు అనంత్ అంబానీకి కాబోయే రాధికా మర్చంట్.. భరతనాట్య ఆరంగేట్రం చేశారు. ముంబయిలోని కుర్లా కాంప్లెక్స్లో గల జియో వరల్డ్ సెంటర్లో భరతనాట్య ప్రదర్శన చేశారు. గోపికతో కృష్ణుడి నృత్యాలు, రాముడి కోసం శబరి ఎదురుచూపులు, చిన్నికృష్ణుడి అల్లరి ఘట్టాలతో నాట్య ప్రదర్శన చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి అంబానీ, మర్చంట్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. రాధిక తొలి నాట్య ప్రదర్శనను తిలకించి ఆశీర్వదించారు. అంబానీ, మర్చెంట్ కుటుంబాలు అతిథులకు సాదర స్వాగతం పలికాయి. కాగా రాధిక మర్చంట్... గత ఎనిమిదేళ్లగా భరతనాట్యం నేర్చుకుంటున్నారు. 2019లో అనంత్ అంబానీతో ఆమెకు నిశ్చితార్థం జరిగింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com