Hyderabad: నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లో నాటుకోడి

Hyderabad: నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లో నాటుకోడి
Hyderabad: నాటు కోడి మాంసం వెరైటీల్లో పందెం కోడి రకానికి చెందిన వారియర్ అత్యంత ఖరీదైనది.

Hyderabad: మాంసాహార ప్రియులకు మంచి వార్త.. బ్రాయిలర్ కోడి మాంసం తిని బోరు కొట్టిన వారికి శుభవార్త.. ఇకపై నాటుకోడి మాంసం ఆర్డర్ చేస్తే చాలు ఇంటికే వచ్చేస్తుంది.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నాటుకోడి మాంసం ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి తెచ్చింది కంట్రీ చికెన్ కో సంస్థ. ప్రస్తుతం మూడు సెంటర్ల నుంచి కస్టమర్లకు సేవలు అందించనుంది.

అందుబాటులో ఐదు రకాలు..

కంట్రీ చికెన్ కో సంస్థ క్లాసిక్ ఆంధ్రా, టెండర్ తెలంగాణ, మైసూర్ క్వీన్, వారియర్, కడక్‌నాథ్ వంటి ఐదు వెరైటీల్లో నాటుకోడి మాంసం అందిస్తోంది.

ధర భారీగానే..

నాటుకోడి రుచిని ఆస్వాదించాలంటే ఆమాత్రం ధర పెట్టాల్సిందే అంటోంది. సంస్థకు సంబంధించిన వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం కేజీ కడక్ నాథ్ మాంసానికి రూ.909, క్లాసిక్ ఆంధ్రాకి అయితే రూ.584, టెండర్ తెలంగాణకు రూ.487, మైసూర్ క్వీన్ రూ.522గా ఉంది. పూర్తిగా సహజ సిద్ధమైన ఆహారం కోళ్లకు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

రుచిలో అమోఘం పందెం కోడి.. ధర చూస్తే..

నాటు కోడి మాంసం వెరైటీల్లో పందెం కోడి రకానికి చెందిన వారియర్ అత్యంత ఖరీదైనది. కేజీ రూ.2599గా ఉంది. మరి వీటికి పెట్టే ఫుడ్డు మామూలుగా లేదుగా.. బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు లాంటి డ్రై ప్రూట్స్ మాత్రమే తింటాయి పందెం కోళ్లు.. అందుకే వాటి మాంసానికి అంత రేటు.

ఆన్‌లైన్లో ఆర్డర్ చేస్తే చాలు ఇంటికే వచ్చేస్తుంది ఫ్రెష్‌గా ఉన్న నాటు కోడి మాంసం. లేదంటే బోయిగూడ, ప్రగతి నగర్, దిల్‌సుఖ్ నగర్‌లలో ఉన్న ఈ సంస్థకు చెందిన బ్రాంచీలకు డైరెక్ట్‌గా వెళ్లి కూడా కొనుక్కోవచ్చు.

Tags

Next Story