August 1st : ఆగస్టు 1వ తేదీ నుంచి మారేవి ఇవే.. !

August 1st : ఆగస్టు 1వ తేదీ నుంచి మారేవి ఇవే.. !
ఆగస్టు 1వ తేదీ నుంచి బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ సేవల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఆగస్టు 1వ తేదీ నుంచి బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ సేవల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు నగదు లావాదేవీలపై ఛార్జీలను పెంచింది. రేపటినుంచి (ఆదివారం)ఇవి అమల్లోకి రానున్నాయి. జరిగే స్వల్ప మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..!

ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అన్ని ఏటీఎంలలో ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు ఛార్జీ పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతిచ్చింది.


ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు నెలకి నాలుగు ఉచిత లావాదేవీలు మాత్రమే చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ. 150 రుసం చెల్లించాలి. ఇతరులు కూడా రూ. 25 వేలు మాత్రమే జమ చేయవచ్చు. డాదికి 25 చెక్కులు ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత 10 చెక్కులుండే ఒక్కో చెక్‌బుక్‌కు రూ.20 చెల్లించాలి.

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ డోర్‌స్టెప్ సేవలకు ఛార్జీలు విధిస్తున్నట్లుగా పేర్కొంది. ఇంటి వద్దకే సేవలు కోరుకునే కస్టమర్లు ప్రతి సర్వీసుకు రూ. 20+GST చెల్లించాల్సి ఉంటుంది.


ఆగస్టు 1 నుంచి చమరు సంస్థలు వంట గ్యాసు ధరలు పెంచే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story