బ్యాంకులతో సమావేశం కానున్న ఆర్థిక మంత్రి
By - Nagesh Swarna |31 Aug 2020 9:08 AM GMT
ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 3న బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలతో సమావేశం కానున్నారు.
ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 3న బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలతో సమావేశం కానున్నారు. లోన్ రీ స్ట్రక్చర్ పథకంలో భాగంగా ఈ కీలక భేటి జరగనుంది. ఇందులో గైడ్ లైన్స్ ఖరారు చేయనున్నారు. ఆగస్టు6న కోవిడ్ కారణంగా నష్టపోయిన కంపెనీలు, MSMEలకు, వ్యక్తిగత రుణాలు రిస్ట్రక్చర్ చేయనున్నట్టు RBIప్రకటించింది. ఆగస్టుతో రుణాలపై మారిటోరియం ముగస్తుండడంతో ఇక రిస్ట్రక్చర్ పై బ్యాంకులు కూడా ద్రుష్టి సారిస్తున్నాయి. కార్పొరేట్, MSME, పర్సనల్ రుణాలకు ఇది వర్తిస్తుంది. అయితే ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. దీంతో నిర్మలా సీతారామన్ తో జరిగే సమావేశంలో క్లారిటీ వస్తుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com