Petrol and Diesel Prices : తగ్గేదేలే.. మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...!

Petrol and Diesel Prices : పెట్రో ధరలు చుక్కలనంటుతున్నాయి. వరుస బాదుడులతో ఇంధన ధరలు ఆల్టైమ్ హై కి చేరుతున్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 87 పైసలు పెంచాయి చమురు సంస్థలు. దీంతో ఏపీలో పెట్రోల్ 120 రుపాయలకు పైగా చేరుకోగా, హైదరాబాద్లో 120 రుపాయల చేరువలోకి వచ్చింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 119రూపాయల 49 పైసలు, లీటర్ డీజిల్ 105 రుపాయల 49 పైసలకు చేరుకుంది.ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్, డీజిల్పై దాదాపు రూ.12 వరకు పెరిగింది.
మార్చి 22న ధరల పెరుగుదల ప్రారంభమైన తర్వాత పెట్రో ధరలు 16రోజుల్లో 14సార్లు పెరిగాయి. రెండు వారాల వ్యవధిలో పెట్రోల్, డీజిల్పై పది రుపాయల వరకు పెరిగింది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 104రూ. 61పైసలకు చేరుకోగా.. లీటర్ డీజిల్ ధర 95రూ. 87పైసలకుగా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ పై 84 పైసల పెంపుతో 119 రూ. 67పైసలకు చేరుకుంది. డీజిల్ పై మరో 85 పైసల వడ్డనతో లీటర్ 103రూ. 92 పైసలకు విక్రయిస్తున్నారు.
ఇంధన ధరల భగభగలతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ఉత్పాదక, రవాణా అవసరాలకు విరివిగా ఉపయోగించే డీజిల్ ధరల ప్రభావం అనేక ఉత్పత్తులపై పడుతోంది. పెరుగుతున్న ధరలతో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు చితికిపోతున్నాయి. రవాణా రంగం కూడా ఢీలాపడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com