వినియోగదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బీఐ వినియోగదారులు ఇంట్లో నుంచే నామినీ పేరు జత చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విటర్ ద్వారా వెల్లడించింది. అయితే దీనికోసం ప్రత్యేకంగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే నామినీ పేరును మూడు రకాలుగా జత చేయవచ్చు.
బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లడం లేదా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నామినీ పేరు జత చేయవచ్చు. ఎస్బీఐ యోనో యాప్ ఇన్ స్టాల్ చేసి అందులోకి లాగిన్ అయిన కింద ఉన్న సర్వీస్ సర్వీసెస్ సెక్షన్లోకి వెళ్లాలి. ఇప్పుడు మీకు ఆన్లైన్ నామినీ ఆప్షన్ కనిపిస్తుంది. ఇలా అకౌంట్కు నామినీ పేరు యాడ్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు చనిపోతే అయితే అప్పుడు ఆ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులుపైన పూర్తి అధికారం నామినీకి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com