NANO CAR: టాటా నానో కారు రీ ఎంట్రీ?

అతి త్వరలో భారత మార్కెట్లోకి టాటా నానో రీఎంట్రీ ఇవ్వనుంది. ఈసారి టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్గా రాబోతుంది. ఒకప్పుడు టాటా నానో భారత ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు టాటా నానో ఈవీ అవతార్గా వచ్చే అవకాశం ఉంది. కొత్త టాటా నానో EV కంపెనీ అందించే ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుదారులకు సరసమైన ధరకే లభ్యం కానుంది. ప్రస్తుతం, టాటా మోటార్స్ రోడ్డుపై అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల (కార్లు)ను కలిగి ఉంది. నానో ఈవీ కారుతో ఈ సెగ్మెంట్ మరింత బలోపేతం చేయాలని కంపెనీ యోచిస్తోంది. టియాగో, టిగోర్, నెక్సాన్ EV (ప్రైమ్, మాక్స్)లను ప్రస్తుతం కంపెనీ భారత మార్కెట్లో అందిస్తోంది.
భారత్లో లాంచ్ అయితే
టాటా నానో EV కారు భారత్లో లాంచ్ అయితే, దానికి భారీ అప్గ్రేడ్లు (బ్యాటరీ, మోటారు కాకుండా) లభిస్తాయి. కొత్త నానో అప్గ్రేడ్ చేసిన క్యాబిన్ ఫీచర్లతో పాటు (ICE వెర్షన్తో పోలిస్తే) కొత్త ప్లాట్ఫామ్ను పొందవచ్చు. అయితే, మనకు నానో ఒకే డిజైన్ (ఐకానిక్) లభించవచ్చు. ఈ కారులో అందించే మోటారు ఇతర టాటా ఈవీ కార్ల కన్నా చిన్నదిగా ఉంటుంది. ఈ టాటా కారును ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 200 కి.మీ రేంజ్ అందిస్తుంది. రాబోయే 5 ఏళ్లలో 10 మోడళ్లను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలపై భారత వాణిజ్య శాఖ కీలక ప్రకటన చేసింది. అమెరికా వాణిజ్య విధానంలో జరిగిన నూతన పరిణామం వల్ల ఏర్పడే అవకాశాలపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com