వాహనదారులకు ఝలక్.. ఈ రోజు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశ వ్యాప్తంగా వాహనదారులపై పెట్రో బాదుడు కొనసాగుతోంది. ప్రతి రోజు మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు ఝలక్ ఇస్తున్నాయి. గత పది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెట్రో ధరలు భగ్గుబంటుండడంతో బండి బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
హైదరాబాద్లో శుక్రవారం(19-02-2021) లీటర్ పెట్రోల్ ధర రూ.93.45కి చేరింది. కాగా హైదరాబాద్లో గురువారం(18-02-2021) లీటర్ పెట్రోల్ ధర రూ.93.10గా ఉంది.
అదే సమయంలో హైదరాబాద్లో శుక్రవారం(19-02-2021) లీటర్ డీజిల్ ధర రూ.87.55కి చేరింది. కాగా హైదరాబాద్లో గురువారం(18-02-2021) లీటర్ డీజిల్ ధర రూ.87.20గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.88గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 80.27గా ఉంది.
ఇక కొలకత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.11గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.83.86గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.32గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 87.32 గా ఉంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.98గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.85.31గా ఉంది.
బెంగుళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.89గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 85.09గా ఉంది.
ఒడిశా లో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.54గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.87.42గా ఉంది.
విజయవాడ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.16గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.89.69గా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com