పెట్రో బాదుడు.. ఈ రోజు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశ వ్యాప్తంగా వాహనదారులపై పెట్రో బాదుడు కొనసాగుతోంది. ప్రతి రోజు మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు ఝలక్ ఇస్తున్నాయి. గత 11 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెట్రో ధరలు భగ్గుబంటుండడంతో బండి బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
హైదరాబాద్లో శనివారం(20-02-2021) లీటర్ పెట్రోల్ ధర రూ.93.78కి చేరింది. కాగా హైదరాబాద్లో శుక్రవారం(19-02-2021) లీటర్ పెట్రోల్ ధర రూ.93.45గా ఉంది.
అదే సమయంలో హైదరాబాద్లో శనివారం(20-02-2021) లీటర్ డీజిల్ ధర రూ.87.91కి చేరింది. కాగా హైదరాబాద్లో శుక్రవారం(19-02-2021) లీటర్ డీజిల్ ధర రూ.87.55గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.19గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 80.60గా ఉంది.
ఇక కొలకత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.41గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.84.19గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.62గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 87.67 గా ఉంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.25గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.85.63గా ఉంది.
బెంగుళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.21గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 85.44గా ఉంది.
ఒడిశా లో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.91గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.87.84గా ఉంది.
విజయవాడ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.44గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.90.03గా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com